AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరం అవినీతిపై విచారణ జరపండి… ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను పట్టికుదిపేస్తున్న సమస్య.. పోలవరం ప్రాజెక్టు. దీని వేదికగా చేసుకునే ఏపీ రాజకీయాలన్నీ సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం, అవినీతి జరిగిందని అధికార వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే రివర్స్ టెండరింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రముఖ సామాజికవేత్త, ఆర్ధిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పోలవరం అవినీతిపై  ఇదివరకే ఓ పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టు […]

పోలవరం అవినీతిపై విచారణ జరపండి... ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2019 | 6:51 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను పట్టికుదిపేస్తున్న సమస్య.. పోలవరం ప్రాజెక్టు. దీని వేదికగా చేసుకునే ఏపీ రాజకీయాలన్నీ సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం, అవినీతి జరిగిందని అధికార వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే రివర్స్ టెండరింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది సీఎం జగన్ ప్రభుత్వం.

ఇదిలా ఉంటే ప్రముఖ సామాజికవేత్త, ఆర్ధిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పోలవరం అవినీతిపై  ఇదివరకే ఓ పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా  అవినీతి జరిగిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని నిర్మాణంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ నరన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర జలవనరుల శాఖ ఈ పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని సూచించింది.

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై పిటిషనర్ పెంటపాటి పుల్లారావు స్పందిస్తూ.. న్యాయస్ధానం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటపడే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన వెల్లడించారు.

Follow Us
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే