ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆన్లైన్ ద్వారానే డిగ్రీ ప్రవేశాలు..
ఏపీలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ పరిధిలోని 218 కళాశాలల్లో ప్రవేశాలను ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని డీన్ రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.
కరోనా వైరస్ కారణంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ విద్యా సంవత్సరం(2020-21) నుంచి సగం సిలబస్ను ఆన్లైన్ క్లాసుల ద్వారా పూర్తి చేయాలని ఇప్పటికే పలు యూనివర్సిటీలు ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి. అలాగే ప్రవేశాలను సైతం ఆన్లైన్ ద్వారానే నిర్వహించనున్నాయి.
ఈ క్రమంలోనే ఏపీలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ పరిధిలోని 218 కళాశాలల్లో ప్రవేశాలను ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని డీన్ రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇక డిగ్రీ కాలేజీల వివరాలను ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు వర్సిటీలోని కళాశాలల డీన్ కార్యాలయంలో పరిశీలించనున్నారు. దీనితో కళాశాలల యాజమాన్యాలు కేటగిరీ, యూనివర్సిటీ ఆమోద పత్రాలు, కోర్సులు, వసతి సదుపాయాలు ఇతరత్రా వివరాలకు సంబంధించిన వాటితో హాజరుకావాలని డీన్ రామిరెడ్డి తెలిపారు.