ఏపీలో కొత్తగా 214 పాజిటివ్ కేసులు.. క్రమక్రమంగా తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..
Corona Cases AP: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,295 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 214 ..

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,295 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 214 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,78,937 కి చేరింది. ఇందులో 3992 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,67,867 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7078కు చేరుకుంది. ఇక నిన్న 422 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,13,01,105 సాంపిల్స్ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 17, చిత్తూరు 46, తూర్పుగోదావరి 18, గుంటూరు 21, కడప 11, కృష్ణా 23, కర్నూలు 8, నెల్లూరు 9, ప్రకాశం 19, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 20, విజయనగరం 4, పశ్చిమ గోదావరి 8 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 21/12/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,76,042 పాజిటివ్ కేసు లకు గాను *8,64,972 మంది డిశ్చార్జ్ కాగా *7,078 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,992#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gl0Z7FDLRw
— ArogyaAndhra (@ArogyaAndhra) December 21, 2020




