AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆధునిక టెక్నాలజీతో సీఐడీ విచారణ

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగించింది....

ఆధునిక టెక్నాలజీతో సీఐడీ విచారణ
Sanjay Kasula
|

Updated on: Aug 24, 2020 | 1:31 PM

Share

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగించింది. ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలతో పాటు క్లూస్ టీం సభ్యులు పీఎటీ టన్నెల్ వద్దకు చేరుకని అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే ఘటన స్థలంలో సేకరించిన శ్యామ్ పుల్స్ ను ఫోరెన్సిక్ సైన్ ల్యాబ్‌కు పంపించింది సీఐడీ. 10 మందితో కూడిన దర్యాప్తు బృందం సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. చికిత్స పొందుతున్న వారి స్టేట్మెంట్‌ను సీఐడీ అధికారులు నమోదుచేసుకున్నారు.

మానవ తప్పిదమా.. లేక సాంకేతిక లోపమా అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక పోస్టుమార్టం రీపోర్ట్‌లో ఊపిరితిత్తులలో పొగ వెళ్లి శ్వాస తీసుకోక ఇబ్బంది పడి చనిపోయినట్టు వెల్లడి అయ్యింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ పనిచేయలేదని నిర్దారించారు సీఐడీ అధికారులు. దీంతో లోపల పొగ దట్టంగా అలుముకుందని అధికారులు గుర్తించారు. ప్యానల్ బోర్డ్ కేంద్రం లో అసలు మంటలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్యానల్ బోర్డ్ కు మంటలు వ్యాపించడంతో ఎగ్జిలరీ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయినట్టు గుర్తించించారు. ప్యానల్ బోర్డ్ కు ఎగ్జిలరీ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ జరిగిన సమయాన్ని అంచనా వేస్తున్న సీఐడీ అధికారులు… అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ప్రమాదం జరగడంపై సమగ్ర విచారణ చేస్తున్నారు సీఐడీ అధికారులు.

Follow Us
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!