ఆధునిక టెక్నాలజీతో సీఐడీ విచారణ
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగించింది....
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగించింది. ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలతో పాటు క్లూస్ టీం సభ్యులు పీఎటీ టన్నెల్ వద్దకు చేరుకని అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే ఘటన స్థలంలో సేకరించిన శ్యామ్ పుల్స్ ను ఫోరెన్సిక్ సైన్ ల్యాబ్కు పంపించింది సీఐడీ. 10 మందితో కూడిన దర్యాప్తు బృందం సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. చికిత్స పొందుతున్న వారి స్టేట్మెంట్ను సీఐడీ అధికారులు నమోదుచేసుకున్నారు.
మానవ తప్పిదమా.. లేక సాంకేతిక లోపమా అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక పోస్టుమార్టం రీపోర్ట్లో ఊపిరితిత్తులలో పొగ వెళ్లి శ్వాస తీసుకోక ఇబ్బంది పడి చనిపోయినట్టు వెల్లడి అయ్యింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ పనిచేయలేదని నిర్దారించారు సీఐడీ అధికారులు. దీంతో లోపల పొగ దట్టంగా అలుముకుందని అధికారులు గుర్తించారు. ప్యానల్ బోర్డ్ కేంద్రం లో అసలు మంటలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్యానల్ బోర్డ్ కు మంటలు వ్యాపించడంతో ఎగ్జిలరీ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయినట్టు గుర్తించించారు. ప్యానల్ బోర్డ్ కు ఎగ్జిలరీ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ జరిగిన సమయాన్ని అంచనా వేస్తున్న సీఐడీ అధికారులు… అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ప్రమాదం జరగడంపై సమగ్ర విచారణ చేస్తున్నారు సీఐడీ అధికారులు.