AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ ఆఫీసులోనే చర్చకు సిద్దం : బొండా ఉమా

అమరావతిలో  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ఏపీ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రతిపక్ష టీడీపీ కౌంటరిచ్చింది. అమరావతి భూముల విషయంలో వైసీపీ ఆఫీస్‌లో అయినా చర్చకు సిద్దమంటూ టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ సవాల్ విసిరారు. ఎప్పుడో  2005లో వేమూరి రవి    అమరావతి ప్రాంతంలో  భూములు కొనుగోలు  చేశారని..ఆయన్ని నారా లోకేశ్ బినాబీ అంటూ ప్రచారం చేయడం వైపీసీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న నాయకులు అమరావతి రాజధాని అవ్వడం వల్ల స్థలాలు […]

వైసీపీ ఆఫీసులోనే చర్చకు సిద్దం : బొండా ఉమా
Ram Naramaneni
|

Updated on: Jan 02, 2020 | 8:30 PM

Share

అమరావతిలో  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ఏపీ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రతిపక్ష టీడీపీ కౌంటరిచ్చింది. అమరావతి భూముల విషయంలో వైసీపీ ఆఫీస్‌లో అయినా చర్చకు సిద్దమంటూ టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ సవాల్ విసిరారు. ఎప్పుడో  2005లో వేమూరి రవి    అమరావతి ప్రాంతంలో  భూములు కొనుగోలు  చేశారని..ఆయన్ని నారా లోకేశ్ బినాబీ అంటూ ప్రచారం చేయడం వైపీసీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న నాయకులు అమరావతి రాజధాని అవ్వడం వల్ల స్థలాలు కొన్నారని..ఆ హక్కు కూడా లేదా అంటూ ద్వజమెత్తారు. పవన్ కళ్యాణ్… చంద్రబాబు దత్తపుత్రుడు అని పలువురు అధికార పార్టీ నేతలు పదే, పదే ఆరోపిస్తున్నారని,  మరి వారు జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలా..అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బొండా ఉమ. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు..ఆర్కే, శ్రీదేవితో పాటు పలువురు వైసీపీ నాయకులకు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు.