హేమంత్ క‌ర్క‌రే అమ‌ర‌వీరుడే..

మధ్యప్రదేశ్ : భోపాల్ బీజేపీ అభ్య‌ర్థి ప్రగ్యా సింగ్ థాకూర్‌.. దివంగ‌త ఏటీఎస్ ఆఫీస‌ర్ హేమంత్ క‌ర్క‌రేపై చేసిన వ్యాఖ్య ప‌ట్ల ఆ పార్టీ ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. ఉగ్ర‌వాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన హేమంత్ క‌ర్క‌రేను అమ‌ర‌వీరుడిగా గుర్తిస్తున్న‌ట్లు బీజేపీ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. క‌ర్క‌రేపై ప్రగ్యా చేసిన వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మైన‌వ‌ని పార్టీ పేర్కొన్న‌ది. త‌న‌కు జ‌రిగిన మాన‌సిక‌, శారీరిక వేధింపుల వ‌ల్లే ప్రగ్యా అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉంటుంద‌ని బీజేపీ తెలిపింది. కాగా […]

హేమంత్ క‌ర్క‌రే అమ‌ర‌వీరుడే..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 12:10 PM

మధ్యప్రదేశ్ : భోపాల్ బీజేపీ అభ్య‌ర్థి ప్రగ్యా సింగ్ థాకూర్‌.. దివంగ‌త ఏటీఎస్ ఆఫీస‌ర్ హేమంత్ క‌ర్క‌రేపై చేసిన వ్యాఖ్య ప‌ట్ల ఆ పార్టీ ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. ఉగ్ర‌వాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన హేమంత్ క‌ర్క‌రేను అమ‌ర‌వీరుడిగా గుర్తిస్తున్న‌ట్లు బీజేపీ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. క‌ర్క‌రేపై ప్రగ్యా చేసిన వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మైన‌వ‌ని పార్టీ పేర్కొన్న‌ది. త‌న‌కు జ‌రిగిన మాన‌సిక‌, శారీరిక వేధింపుల వ‌ల్లే ప్రగ్యా అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉంటుంద‌ని బీజేపీ తెలిపింది. కాగా మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రగ్యాను.. ఐపీఎస్‌ ఆఫీస‌ర్ హేమంత్ క‌ర్క‌రే విచారించారు. అయితే ముంబై ఉగ్ర‌దాడిలో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. తాను శ‌పించ‌డం వ‌ల్లే క‌ర్క‌రే ఉగ్ర‌వాదుల తూటాల‌కు బ‌లైన‌ట్లు ప్రగ్యా వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ప్రగ్యా సింగ్ థాకూర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఘం ఖండించింది. ప్రగ్యా వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఘం ఓ ట్వీట్ చేసింది. హేమంత్ క‌ర్క‌రే అశోక చ‌క్ర గెలుచుకున్నార‌ని, ఉగ్ర‌వాదుల‌తో పోరాడి ప్రాణాల‌ను అర్పించార‌ని, ప్రగ్యా థాకూర్ చేసిన అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని, పోలీసు అమ‌ర వీరుల‌ను గౌర‌వించాల‌ని ఐపీఎస్ సంఘం డిమాండ్ చేసింది.