AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏనుగు పాయె.. వేలూ పాయె..

మీరట్ : పొరపాటున తన అభిమాన బీఎస్పీకి బదులు బీజేపీకి ఓటేశాననే బాధతో ఓ బీఎస్పీ అభిమాని తన వేలిని నరుక్కున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. యూపీలోని బులంద్ షహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీ అయిన భోలాసింగ్ పై ఎస్పీ-బీఎస్పీ,ఆర్ఎల్డీ ఉమ్మడి అభ్యర్థిగా యోగేష్ వర్మ ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం పోలింగ్ జరిగిన ఈ నియోజకవర్గంలోని షికార్ పూర్ పోలింగ్ కేంద్రానికి అబ్దుల్లాపూర్ హులసాన్ గ్రామానికి చెందిన బీఎస్పీ మద్ధతుదారైన పవన్ […]

ఏనుగు పాయె.. వేలూ పాయె..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2019 | 8:04 PM

Share

మీరట్ : పొరపాటున తన అభిమాన బీఎస్పీకి బదులు బీజేపీకి ఓటేశాననే బాధతో ఓ బీఎస్పీ అభిమాని తన వేలిని నరుక్కున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. యూపీలోని బులంద్ షహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీ అయిన భోలాసింగ్ పై ఎస్పీ-బీఎస్పీ,ఆర్ఎల్డీ ఉమ్మడి అభ్యర్థిగా యోగేష్ వర్మ ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం పోలింగ్ జరిగిన ఈ నియోజకవర్గంలోని షికార్ పూర్ పోలింగ్ కేంద్రానికి అబ్దుల్లాపూర్ హులసాన్ గ్రామానికి చెందిన బీఎస్పీ మద్ధతుదారైన పవన్ కుమార్ ఓటేసేందుకు వచ్చారు. పవన్ కుమార్ బీఎస్పీకి ఓటేయబోయి పొరపాటున బీజేపీకి వేశారు. అనంతరం తన పొరపాటును గ్రహించిన పవన్ కుమార్ ఆవేదన చెందారు. పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి తిరిగివచ్చిన పవన్ కుమార్ ఇలాంటి తప్పు మరోసారి చేయకుండా ఉండేలా తన వేలిని తానే కత్తితో నరుక్కున్నాడు. వేలు నరుక్కున్న ఘటనను వీడియో తీసిన పవన్ కుమార్ దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు.