Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల ఆగ్రహానికి పరాకాష్ట, హర్యానా స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జేజేపీ కూటమికి దెబ్బ ! కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు హర్యానా స్థానిక ఎన్నికల్లో పాలక బీజేపీ, దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కి చెంప దెబ్బ కొట్టారు.

రైతుల ఆగ్రహానికి పరాకాష్ట, హర్యానా స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జేజేపీ కూటమికి దెబ్బ ! కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Dec 30, 2020 | 6:31 PM

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు హర్యానా స్థానిక ఎన్నికల్లో పాలక బీజేపీ, దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కి చెంప దెబ్బ కొట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ కూటమిని దెబ్బ తీశారు.  సోనీపట్, అంబాలాలో ఈ కూటమి మేయర్ పదవులను కోల్పోయింది. ఈ ఎన్నికలను ఈ కూటమి ప్రతిష్టాత్మకమైనవిగా భావించింది. డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ.. ఆయన సొంత జిల్లాలోనే నష్టాన్ని చవి చూసింది. అంబాలా, పంచకుల, సోనీపట్, ధరుహేరా, రోహ్తక్ లోని సంప్లా, హిస్సార్ లోని ఉక్లానా ల స్థానిక ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఓట్ల ను బుధవారం లెక్కించారు. సోనీపట్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ 14 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుచుకుంది. ఇక్కడ ఈ పార్టీకి 72,111 ఓట్లు రాగా-బీజేపీ 58,300 ఓట్లు దక్కించుకుంది. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు బోర్డర్ సమీపంలోనే సోనీపట్ ఉంది.

అంబాలాలో హర్యానా జనచేతన  పార్టీకి చెందిన శక్తి రాణి శర్మ మేయర్ కానున్నారు. ఈమె మాజీ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ భార్య. ఇక హర్యానాలో బీజేపీ-జేజేపీ నేతలను తమ గ్రామాల్లోకి రానివ్వరాదని పలుగ్రామాలవాసులు నిర్ణయించుకున్నారు. గత నెలలో ఢిల్లీకి వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువును ప్రయోగించారు, వాటర్ క్యానన్లను వినియోగించారు. దీంతో నాడే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం తీవ్ర విమర్శలనెదుర్కొంది.