AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితీష్ కుమార్ కి అమిత్ షా ఫోన్ ! ఏంచేద్దాం ?

బీహార్ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీలకు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఈ ఎన్నికల్లో దాదాపు 7 గంటల ప్రాంతంలో..ఎన్డీయే 125 సీట్లలో లీడ్ లో ఉండగా..మెజారిటీకి ఈ పార్టీకి 122 స్థానాలు అవసరమవుతాయి. ఓట్ల లెక్కింపు 75 శాతానికి పైగా ముగిసేసరికి బీజేపీ 10 సీట్లలో విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది. అటు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 8 సీట్లను, జేడీ-యూ 6, కాంగ్రెస్ 2, ఎం ఐ ఎం 1, వికాస్ శీల్ ఇన్సాఫ్ […]

నితీష్ కుమార్ కి అమిత్ షా ఫోన్ ! ఏంచేద్దాం ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 10, 2020 | 8:16 PM

Share

బీహార్ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీలకు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఈ ఎన్నికల్లో దాదాపు 7 గంటల ప్రాంతంలో..ఎన్డీయే 125 సీట్లలో లీడ్ లో ఉండగా..మెజారిటీకి ఈ పార్టీకి 122 స్థానాలు అవసరమవుతాయి. ఓట్ల లెక్కింపు 75 శాతానికి పైగా ముగిసేసరికి బీజేపీ 10 సీట్లలో విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది. అటు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 8 సీట్లను, జేడీ-యూ 6, కాంగ్రెస్ 2, ఎం ఐ ఎం 1, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ 2, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో హోం మంత్రి అమిత్ షా.. జేడీ-యూ అధినేత, సీఎం నితీష్ కుమార్ కి ఫోన్ చేసి తదుపరి కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ…. నితీష్ నివాసానికి చేరుకున్నారు. వీరు కూడా  తాజా పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా అని విశ్లేషకులు తర్కించుకుంటున్నారు.