Balakrishna: బాలయ్య సతీమణి సంతకం ఫోర్జరీ.. క్రిమినల్ కేసు..!

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేశాడు. ఆ సంతకంతో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్లు ఈ నెల 13న వసుంధర ప్రతినిధికి ఫోన్ చేశారు. అందులో వసుంధర మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని […]

Balakrishna: బాలయ్య సతీమణి సంతకం ఫోర్జరీ.. క్రిమినల్ కేసు..!
Follow us

| Edited By:

Updated on: Feb 17, 2020 | 11:08 AM

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేశాడు. ఆ సంతకంతో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్లు ఈ నెల 13న వసుంధర ప్రతినిధికి ఫోన్ చేశారు. అందులో వసుంధర మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపిన వారు, అకౌంట్‌ నంబర్‌ కూడా చెప్పి అకౌంట్‌ను యాక్టివేట్‌ చేయమంటారా? అంటూ ప్రశ్నించారు. అయితే తాము ఏ మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని, అసలు దరఖాస్తే చేసుకోలేదని వసుంధర ప్రతినిధి తెలిపారు. తరువాత ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా.. తాను ఎలాంటి మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని వసుంధర స్పష్టం చేసింది. దీంతో బ్యాంకు అధికారులు ఆరా తీయగా.. కొత్తగా వచ్చిన ఓ అకౌంటెంట్ ఈ చర్యకు పాల్పడ్డట్లు తేలింది. దీనిపై అతడిని నిలదీయగా మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో వసుంధర ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ అకౌంటెంట్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.