స్థానిక ఎన్నికలకు ముందే రంగులు మార్చండి..3 వారాల గడువిచ్చిన హైకోర్టు
లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ముందే.. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్కార్ 3 వారాలు గడువు కోరగా… కోర్టు అందుకు అంగీకరించింది. గడువులోపు గవర్నమెంట్ ఆఫీసులకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని స్పష్టం చేసింది. పంచాయతీ ఆఫీసులకు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగుల్ని తీసేయాలని, గవర్నమెంట్ ఆఫీసులకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని […]
లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ముందే.. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్కార్ 3 వారాలు గడువు కోరగా… కోర్టు అందుకు అంగీకరించింది. గడువులోపు గవర్నమెంట్ ఆఫీసులకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని స్పష్టం చేసింది.
పంచాయతీ ఆఫీసులకు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగుల్ని తీసేయాలని, గవర్నమెంట్ ఆఫీసులకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు అమలుకు మరికొంత సమయం కావాలని సర్కార్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇటీవలే విచారణ చేసిన కోర్టు…. 3 నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా… అందుకు నిరాకరించింది. దీనిపై సోమవారం మరోసారి విచారణను చేపట్టిన ధర్మాసనం 3 వారాల గడువు ఇచ్చింది.