AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన ఏపీ రాజ్యసభ పోలింగ్

ఆంధ్ర ప్రదేశ్ లోని 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఓట్ల లెక్కించనున్నారు. సాయంత్రం 6 గంటలకు రిటర్నింగ్‌ అధికారి ఫలితాలు వెల్లడించనున్నారు

ముగిసిన ఏపీ రాజ్యసభ పోలింగ్
Balaraju Goud
|

Updated on: Jun 19, 2020 | 5:31 PM

Share

ఆంధ్ర ప్రదేశ్ లోని 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రం 6 గంటలకు రిటర్నింగ్‌ అధికారి ఫలితాలు వెల్లడించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన పోలింగ్ లో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్వారంటైన్ లో ఉండటం వల్ల ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఓటుహక్కు వినియోగించుకోలేదు. రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు గానూ ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి, రిలయర్స్‌ గ్రూపునకు చెందిన పరిమళ్‌ నత్వానీ పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు. అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బట్టి మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఫలితం తేలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.