చైనా కంపెనీతో భారత రైల్వే ఒప్పందం రద్దు
భారత్ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే శాఖ ఒక కాంట్రాక్టును రద్దు చేసుకుంది. కాన్పూర్- దీన్దాయాల్ ఉపాధ్యాయ (మొఘల్ సరాయ్) సెక్షన్ల మధ్య 417 కిలోమీటర్ల మేర టెలీకమ్యునికేషన్స్, సిగ్నలింగ్ ప్రాజెక్టు రద్దు చేసుకుంది.

చైనా దొంగ దెబ్డకు సరిహద్దులో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులు, వస్తువులు, కంపెనీలపై నిషేధం విధించాలని నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే శాఖ ఒక కాంట్రాక్టును రద్దు చేసుకుంది. కాన్పూర్- దీన్దాయాల్ ఉపాధ్యాయ (మొఘల్ సరాయ్) సెక్షన్ల మధ్య 417 కిలోమీటర్ల మేర టెలీకమ్యునికేషన్స్, సిగ్నలింగ్ ప్రాజెక్టు చేపట్టింది. ఇందుకుగానూ 2016లో చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యునికేషన్ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు ఈ కాంట్రాక్టు రద్దు చేసినట్లు ఇండియన్ రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు చైనా కంపెనీలతో భారతీయులకు ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి.