హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి.. రూ. కోటిపై మాటే..
హైదరాబాద్ : విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టుబడింది. పంతంగి టోల్గేట్ వద్ద డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా.. డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 1121 కిలోల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.1.68 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి నార్కొటిక్ డ్రగ్స్ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు […]
హైదరాబాద్ : విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టుబడింది. పంతంగి టోల్గేట్ వద్ద డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా.. డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 1121 కిలోల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.1.68 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి నార్కొటిక్ డ్రగ్స్ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.