AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్ట్‌టైమ్‌ వ్యవసాయం.. 30 లక్షల ఆదాయం..! సాధ్యం చేసి చూపించాడు ఈ ఉపాధ్యాయుడు.. ఎలాగో మీరు తెలుసుకోండి..

UP Teacher Success Story : ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయుడు దశాబ్దానికి పైగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడు. అంతేకాకుండా వ్యవసాయం కూడా ప్రారంభించాడు. ప్రత్యేకత ఏమిటంటే పిల్లలకు నేర్పించడం

పార్ట్‌టైమ్‌ వ్యవసాయం.. 30 లక్షల ఆదాయం..! సాధ్యం చేసి చూపించాడు ఈ ఉపాధ్యాయుడు.. ఎలాగో మీరు తెలుసుకోండి..
Farming
uppula Raju
|

Updated on: Apr 11, 2021 | 5:33 AM

Share

UP Teacher Success Story : ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయుడు దశాబ్దానికి పైగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడు. అంతేకాకుండా వ్యవసాయం కూడా ప్రారంభించాడు. ప్రత్యేకత ఏమిటంటే పిల్లలకు నేర్పించడం ద్వారా సంపాదించే దానికంటే ఎక్కువ వ్యవసాయం నుండి ఆర్జిస్తున్నారు. బారాబంకి జిల్లాలోని దౌలత్‌పూర్‌లో నివసిస్తున్న అమరేంద్ర ప్రతాప్ సింగ్ ప్రారంభ రోజుల్లో పాఠశాల పిల్లలకు బోధించడం ద్వారా ఏటా రూ.1.20 లక్షలు సంపాదించేవారు. ఇప్పుడు వ్యవసాయం నుంచి ఏటా 30 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. తన చుట్టూ ఉన్న చాలా మంది రైతులకు మంచి వ్యవసాయం కోసం మార్గనిర్దేశం చేస్తున్నారు. 2014 వేసవి సెలవుల్లో 30 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు.

ప్రారంభంలో అతను కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వీడియోలను చూశాడు.. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ సాయంతో సరైన మార్గంలో వ్యవసాయం గురించి అవగాహన పెంచుకున్నాడు. తరువాత అరటి పండించడం ప్రారంభించారు. సాధారణంగా రైతులు తమ ప్రాంతంలో చెరకు, ముతక ధాన్యాలు, గోధుమలను పండిస్తారు. కానీ ఈ పంటల నుంచి రైతులు ఆదాయం తక్కువ. చెరకు పెంపకం ద్వారా మంచి ఆదాయం సంపాదించాలంటే రైతులు రెండేళ్లపాటు సేద్యం చేయాలి.

ఒక ప్రయోగంగా చేసిన అరటి సాగు వల్ల అమరేంద్రకు కొంత ప్రయోజనం వచ్చింది. మరుసటి సంవత్సరం అరటి పొలంలో పసుపు, అల్లం, కాలీఫ్లవర్లను పండించాలని నిర్ణయించుకున్నాడు. అతను అల్లం నుంచి పెద్దగా ప్రయోజనం పొందలేదు కానీ పసుపు అమరేంద్రకు బాగా సంపాదించడానికి అవకాశం ఇచ్చింది. ఇది అతనికి చాలా సంపాదించింది. అతను అరటిపండులో పెట్టిన డబ్బు తిరిగి అతని వద్దకు వచ్చింది. అంతేకాకుండా అరటిపండ్ల అమ్మకం ద్వారా వారు నికర లాభం పొందారు.

అరటి సాగులో విజయం సాధించిన తరువాత అమరేంద్ర పుచ్చకాయ, బంగాళాదుంపలతో ప్రయోగాలు చేశారు. థార్ వ్యవసాయం గురించి అవగాహన పెంచుకోవడం, యూట్యూబ్ వీడియోలను చూడటం వాటిని మంచి మార్గాల్లో ఉపయోగించడం ద్వారా చాలామంది తమ వ్యవసాయ అనుభవాన్ని మెరుగుపరిచారు. తరువాత వారు స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, పుట్టగొడుగులను కూడా పండించడం ప్రారంభించారు.

చాలా సంవత్సరాల అనుభవంతో ఇప్పుడు అమరేంద్ర పంట వ్యర్థాల నుంచి ఎరువును కూడా తయారుచేస్తున్నారు. ఈ విధంగా వ్యవసాయ వ్యర్థాలు వారి వ్యవసాయానికి కంపోస్ట్‌గా పనిచేస్తున్నాయి. సీజన్‌ల ప్రకారం పంటలను మర్చుతారు. అలాగే ఇంటర్‌ క్రాపింగ్ టెక్నాలజీతో వారికి మంచి లాభాలు లభిస్తాయి. అమరేంద్ర ఇప్పుడు 60 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఇందులో 30 ఎకరాలు సొంత భూమి, మరో 30 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. మొక్కజొన్న, కొత్తిమీర, వెల్లుల్లి పండిస్తున్నారు.

30 ఎకరాల భూమిలో కూరగాయలను పండిస్తారు.. మిగిలిన 30 ఎకరాలలో చెరకు, గోధుమలు ఇతర ముతక ధాన్యాలు సాగు చేస్తారు. అలాంటి భూమి నుంచి సంవత్సరం కోటి రూపాయల వ్యాపారం అతనికి లభిస్తుంది. ఇందులో వారి లాభం 30 లక్షల రూపాయలు. కాలక్రమేణా వారు ఇప్పుడు నీటిపారుదల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. బిందువులు, స్ప్రింక్లర్లతో పాటు నేల తేమను నిర్వహించడానికి మల్చింగ్ పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నారు.

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు

చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..