AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Whale: సిక్కోలు జిల్లా తీరానికి కొట్టుకొచ్చిన భారీ అరుదైన చేప.. దాని బరువు తెలిస్తే షాక్..!

సముద్ర తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. అరుదైన సముద్ర జీవులు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఇచ్చాపురం మండలం, డోంకురు తీరప్రాంతంకి అరుదైన భారీ చేప కొట్టుకువచ్చింది. అది అప్పటికే మృతి చెందింది. దాని పొడవు సుమారు 16అడుగులు కాగా.. వెడల్పు సుమారు 6 ఆడుగులు ఉంది.

Rare Whale: సిక్కోలు జిల్లా తీరానికి కొట్టుకొచ్చిన భారీ అరుదైన చేప.. దాని బరువు తెలిస్తే షాక్..!
Rare Largest Heavy Whale
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Mar 02, 2024 | 1:08 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన సముద్రతీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం. జిల్లాలో 193 కి.మీ. పొడువున బంగాళాఖాతం సముద్ర తీరం విస్తరించి ఉంది. అందుకే ఈ తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. అరుదైన సముద్ర జీవులు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఇచ్చాపురం మండలం, డోంకురు తీరప్రాంతంకి అరుదైన భారీ చేప కొట్టుకువచ్చింది. అది అప్పటికే మృతి చెందింది. దాని పొడవు సుమారు 16అడుగులు కాగా.. వెడల్పు సుమారు 6 ఆడుగులు ఉంది.

ఇక అరుదైన చేప బరువు రెండు టన్నులు ఉంటుందని స్థానిక మత్స్యకారుల అంచనా వేశారు. ఇంత భారీ చేప ఎందుకు కొట్టుకువచ్చింది అనేదానిపై ఇంకా సరైన సమాచారం లేదు. అయినప్పటికి ఆహారం దొరకక, అనారోగ్యంతో మృతి చెందిగాని లేదా సముద్రంలో భారీ బోటుల దాటికి గాయపడి గాని మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ చేపను పులి బగ్గు పొర్ర చేప అని పిలుస్తారని చెబుతున్నారు స్థానిక మత్స్యకారులు.

చేపను చూసేందుకు భారీగా తరలివచ్చిన స్థానికులు

అరుదైన భారీ చేప కావడంతో విషయం తెలిసి చేపను చూసేందుకు డోంకురు గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. కొందరు అంత పెద్ద సైజులో ఉన్న చేపను చూసి ఫోటోలు తీసుకున్నారు. స్కూల్ కి వెళ్ళే చిన్నారులు అయితే చేప పైకి ఎక్కి గంతులు వేస్తూ కేరింతలు కొట్టారు. విషయం తెలిసి బుదవారం పలాస కాశీబుగ్గ అటవీ రేంజ్ ఆఫీసర్ మురలినాయుడు మృతిచెందిన భారీ చేపను పరిశీలించారు. అక్కడే మృతి చెందిన చేపకు పోస్టు మార్టం నిర్వహించి సాగర తీరంలోనే పాతిపెట్టారు.

వీడియో చూడండి…

గతంలోనూ తీరం చేరిన భారీ చేపలు

గతంలోనూ సిక్కోలు తీరంకి భారీ చేపలు కొట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2022 లో ఏప్రిల్ సంతబొమ్మాలి మండలం ఎం.సున్నాపల్లి గ్రామoలో 2022 , మే నెలలో భారీ చేప కొట్టుకువచ్చింది. 2023 లోను వజ్రపు కొత్తూరు మండలం సముద్ర తీరానికి మరో చేప ఈదుకుంటూ వచ్చి ఇసుక తెన్నుల్లో ఇరుక్కుంది. స్థానికులు దానిని సముద్ర తీరం లోకి నెట్టగా మెల్లగా సముద్ర జలాల్లోకి చేరుకుంది భారీ చేప. 2022 లో సంతబొమ్మాళి మండలం సముద్ర తీరానికి బంగారు వర్ణంతో కూడిన రథం కొట్టుకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!