AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Humanity : రైలు కిందపడి కోవిడ్ రోగి సూసైడ్, అంత్యక్రియలకు ముందుకురాని కుటుంబం, మానవత్వం చాటుకున్న ముస్లిం యువత

Covid Suicide : కోవిడ్ బారినపడిన ఓ యువకుడు ఆత్మస్థైర్యం కోల్పోయి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు...

Humanity : రైలు కిందపడి కోవిడ్ రోగి సూసైడ్, అంత్యక్రియలకు ముందుకురాని కుటుంబం, మానవత్వం చాటుకున్న ముస్లిం యువత
Humanity
Venkata Narayana
|

Updated on: Apr 18, 2021 | 8:09 AM

Share

Covid Suicide : కోవిడ్ బారినపడిన ఓ యువకుడు ఆత్మస్థైర్యం కోల్పోయి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణానికి చెందిన హనుమంతు(35) కోవిడ్ బారినపడి ఐదు రోజులుగా హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు. అయితే మానసిక స్టైరం కోల్పోయిన ఆ యువకుడు తాండూరు పట్టణంలోని ఫ్లై ఓవర్ కింద రైలు పట్టాలపైపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు శవాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ శవాన్ని తీసుకొని అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ ముస్లిం వెల్ఫేర్ యూత్ సభ్యులు హనుమంతు శవాన్ని తీసుకొని హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. కోవిడ్ రోగికి అంత్యక్రియలు జరిపించిన తాండూర్ యూత్ సభ్యులను పలువురు అభినందించారు. కాగా, తాండూరులోని సీతారాంపేట్‌కు చెందిన హనుమంతుకు ఈశ్వరితో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read also : Road accident on ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా కల్వర్టును కొట్టిన లోడులారీ