Viral: ఇందుకే కదా మాతృదేవోభవ అనేది.. కూతురిని పెంచేందుకు పురుషావతారం ఎత్తిన తల్లి..

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన ఓ మహిళకు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త మరణించాడు. దీంతో తన కుమార్తెను ఎలాంటి బాధలు లేకుండా పెంచాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తనో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

Viral: ఇందుకే కదా మాతృదేవోభవ అనేది.. కూతురిని పెంచేందుకు పురుషావతారం ఎత్తిన తల్లి..
Women Disguised Herself
Follow us

|

Updated on: May 14, 2022 | 1:10 PM

Mother’s Care: బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు తన జీవితాన్ని వారికి అంకితం చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేస్తుంటుంది. తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటుంది. వారి కోసం తనకు ఇష్టమైన వాటిని ఎన్నో వదిలేస్తుంటుంది. అందుకే అమ్మ అంటే అందరికి ఓ నమ్మకం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మ పక్క నుంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది. మనకు చిన్న దెబ్బ తగిలినా.. వెంటనే మన నోటి నుంచి వచ్చే పదమే అమ్మ.. అందుకే మాతృదేవోభవ అంటూ ప్రతిరోజు తలచుకుంటూ ఉంటాం. అయితే, ఇలాంటి కోవకే చెందిన ఓ అమ్మ గురించి.. కాదు..కాదు.. నాన్నలా మారిన అమ్మ స్టోరీని మనం తప్పక తెలుసుకోవాల్సిందే. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త మరణించడంతో, తన కుమార్తెను ఎంతో చక్కగా పెంచాలని నిర్ణయించుకుంది. వేధింపులకు దూరంగా తన కుమార్తెను ఉంచాలనుకుంది. ఈ క్రమంలో తనో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తన బిడ్డ జీవితం కోసం పురుషుడి అవతారం ఎత్తింది. అసలు ఇలా ఎందుకు చేసిందో తెలుసుకంటే షాకవుతారు..

మూడు దశాబ్దాల క్రితం తూత్తుకుడిలోని కటునాయకన్‌పట్టి గ్రామానికి చెందిన పెచ్చియమ్మాళ్ (20)కి పెళ్లయిన 15 రోజులకే భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కానీ, అప్పటికే ఆమె గర్భం దాల్చింది. కొన్ని నెలల తర్వాత ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక బిడ్డను చక్కగా పెంచడం కోసం, పెచ్చియమ్మాళ్ పలు పనులు చేయడం ప్రారంభించింది. కానీ, పనిచేసే చోట వేధింపులను ఎదుర్కొంది. తన ఒక్కగానొక్క కూతుర్ని.. మళ్లీ పెళ్లి చేసుకోకుండా పెంచాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం పెచ్చియమ్మాళ్ పురుషావతారంఎత్తింది. ఈ క్రమంలో తను కేవలం రూపాన్ని మార్చుకుని ‘ముత్తు’గా మారింది.

రూపాంతరం..

ఇవి కూడా చదవండి

పురుషుడి రూపం కోసం ఆమె జుట్టును కత్తిరించి, లుంగీ, చొక్కా ధరించింది. ముత్తు గత మూడు దశాబ్దాలుగా చెన్నై, తూత్తుకుడిలోని హోటళ్లు, టీ దుకాణాలు వంటి అనేక ప్రాంతాల్లో పనిచేశారు. ఆమె పనిచేసిన ప్రతిచోటా ‘అన్నాచి’ (మగవాడికి సాంప్రదాయ పేరు) అని పిలవడం ప్రారంభించారు.

పెచ్చియమ్మాళ్ నుంచి ‘ముత్తు మాస్టర్’ వరకు..

‘పెయింటర్‌గా, టీ మాస్టర్‌గా, పరోటా మాస్టర్‌గా, 100 రోజుల పని వరకు అన్ని రకాల ఉద్యోగాలు చేశాను. నా కుమార్తెకు భద్రత కల్పించేందుకు ప్రతి పైసా పొదుపు చేశాను. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ‘ముత్తు’ నా గుర్తింపుగా మారిపోయాడు. ఇది ఆధార్, ఓటర్ ID, బ్యాంక్ ఖాతాతో సహా అన్ని పత్రాలలో ఇలాగే ఉంది” అని ఆమె పేర్కొన్నారు.

ఇలా ఉండడం మొదట్లో చాలా కష్టమని ఆమె పేర్కొంది. “నా కూతురి భద్రతను దృష్టిలో ఉంచుకుని, నేను ఇబ్బందులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. నా జీవనోపాధి కోసం నేను ఎక్కువ ప్రయాణాలు చేశాను. ఈ సమయంలో మారువేషంలో నన్ను నా పని ప్రదేశంలో సురక్షితంగా ఉంచుకోగలిగాను. నా గుర్తింపును నిజం చేయడానికి, నేను ఎల్లప్పుడూ బస్సుల్లో పురుషుల సీట్లల్లోనే కూర్చున్నాను. నేను పురుషుల టాయిలెట్‌ను కూడా ఉపయోగించాను. ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించినప్పటికీ, నేను ఛార్జీలు చెల్లించాను”అని ఆమె తెలిపింది.

నెరవేరిన ఆశలు..

57 ఏళ్ల పెచ్చియమ్మాళ్ ఇప్పుడు సంతృప్తిగా ఉంది. ‘‘నా కూతురికి పెళ్లయింది. నా కోరికలన్నీ తీరిపోయాయి. నేను చనిపోయిన తర్వాత కూడా ఇలాగే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి పింఛన్‌ రాకుంటే జీవితాంతం పురుషుడిలానే గడుపుతాను. అనేక పథకాలకు నేను అనర్హులుగానే ఉన్నాను’’ అని ఆమె అన్నారు.

ఆమె కష్టాల గురించి ఒకరిద్దరితోపాటు ఆమె కుమార్తె షణ్ముగసుందరికి మాత్రమే తెలుసు. “ఆమె తన జీవితాన్ని నా కోసం అంకితం చేసింది. ఆమెకు ఫించన్ లభిస్తుందని నేను ఆశిస్తున్నాను” అని షణ్ముగసుందరి అన్నారు.

Also Read: Telangana: పేదలకు తీపికబురు.. రేషన్‌ షాపుల్లో మినీ సిలిండర్లు.. ఇవిగో వివరాలు..

Viral: పొట్టు పొట్టుగా చిరిగిన షూస్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు