Shaik Madar Saheb |
Updated on: Mar 29, 2021 | 6:00 AM
Eyesight Improve tips: ఆధునిక ప్రపంచంలో.. అందరికీ కంటి చూపు సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. చాలామంది గంటల తరబడి కంప్యూటర్పై పనిచేస్తుండటం, అదేవిధంగా స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడం, టీవీని గంటల తరబడి చూస్తుండటం.. నిద్రలేమి, మన జీవన శైలీ, ఆహారం తదితర వాటి వల్ల కంటి సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి.
ప్రస్తుత జీవన విధానంలో మన కంటిచూపును జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. అయితే ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలతోనే కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
ఉదయం పూట నీటిలో ఉసిరి పొడి, తేనె కలుపుని తాగితే కంటి చూపు పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉసిరిలో ఉండే విటమిన్ సీ, పలు పోషకాలు కంటిచూపుకి రక్షణనిస్తాయి.
ప్రతీ రోజూ ఆహారంలో ఆకుకూరలను చేర్చాలి. దీంతోపాటు నిమ్మ, క్యారెట్, మెంతి వంటి కాయకూరలను తింటుంటే.. కంటిచూపు మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు.
Smart Phone effect
ఇంకా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కళ్ళని మూస్తూ తెరుస్తూ.. కంటి వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అలాగే కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రతీ అరగంట, గంటకు కొన్ని సెకన్ల పాటు గ్యాప్ తీసుకోవాలని పేర్కొంటున్నారు.