AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raisin Water Benefits: రోజూ పొద్దుగాల ఈ నీళ్లు తాగితే బరువు తగ్గడం గ్యారంటీ..!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. బరువు నియంత్రించుకోవడానికి సహాయ పడే ఒక సహజ మార్గం ద్రాక్ష నీరు. ఎండు ద్రాక్ష ను నీటి లో నానబెట్టి త్రాగడం వల్ల కలిగే లాభాలు అనేకం. ఈ అలవాటు మన రోజు వారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

Raisin Water Benefits: రోజూ పొద్దుగాల ఈ నీళ్లు తాగితే బరువు తగ్గడం గ్యారంటీ..!
Raisin Water
Prashanthi V
|

Updated on: May 28, 2025 | 2:12 PM

Share

ద్రాక్ష మూడు రంగుల్లో వస్తుంది.. ఆకుపచ్చ, నలుపు, బంగారు. ఇందులో విటమిన్ B, విటమిన్ C, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, కాల్షియం ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు. ఇవి శక్తిని ఇచ్చి శరీరంలో ఉన్న సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

ఒక గుప్పెడు ఎండు ద్రాక్షలో 108 కేలరీలు, 29 గ్రాముల శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము ప్రోటీన్, 21 గ్రాముల చక్కెర, 1 గ్రాము ఫైబర్ ఉన్నాయి. ఇంకా ఇందులో ఐరన్, కాపర్, పొటాషియం, మాంగనీస్, బోరాన్ ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

ద్రాక్ష నీరుకి కావాల్సిన పదార్థాలు

  • ఎండు ద్రాక్ష – 150 గ్రాములు
  • నీరు – 2 కప్పులు
  • నిమ్మరసం – కావాల్సినంత

తయారీ విధానం

150 గ్రాముల ద్రాక్షను రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత అదే నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి కొద్దిగా వేడి చేయాలి. ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ నీటిని తాగిన తర్వాత అరగంట పాటు ఏమీ తినకూడదు.

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ద్రాక్ష నీరు తాగితే కాలేయంలో ఉన్న టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. రక్తం శుభ్రంగా మారుతుంది. శరీరం హాయిగా ఉంటుంది.

ఈ నీరు కడుపులో యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఎవరికైనా అసిడిటీ సమస్య ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. కడుపు మంట లేకుండా చేస్తుంది.

నానబెట్టిన ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి.

ద్రాక్ష నీరు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. శరీరంలో కొవ్వు స్థాయి కూడా తగ్గుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది మలబద్ధకం, అజీర్ణం ఉన్నవారికి మంచిది. ప్రేగుల కదలిక సజావుగా జరుగుతుంది. శరీరానికి తేలికగా ఉంటుంది.

ద్రాక్ష నీరులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది మంచి సహాయం చేస్తుంది.

బోరాన్, కాల్షియం లాంటి పోషకాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. పళ్లు, గోళ్లు కూడా బలంగా ఉంటాయి. ఈ నీటిని ప్రతిరోజూ తాగడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ విధంగా ఎండు ద్రాక్ష నీరు శరీరానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)