AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: భోజనం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు మారుతున్నాయి. గతంలో నేలపై కుటుంబ సభ్యులంతా కూర్చుని సామూహికంగా ఒకేసారి భోజనం చేసేవారు. రానురానూ ఆ అలవాటు తప్పుతూ వస్తోంది. ఎవరికి  ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటున్నారు. అయితే తినేటప్పుడు..

Health Tips: భోజనం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Sit On The Floor
Amarnadh Daneti
|

Updated on: Dec 09, 2022 | 6:09 PM

Share

కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు మారుతున్నాయి. గతంలో నేలపై కుటుంబ సభ్యులంతా కూర్చుని సామూహికంగా ఒకేసారి భోజనం చేసేవారు. రానురానూ ఆ అలవాటు తప్పుతూ వస్తోంది. ఎవరికి  ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటున్నారు. అయితే తినేటప్పుడు మంచంపై లేదా డైనింగ్ టేబుల్ పై కూర్చుని తినడం అలవాటు చేసుకున్నారు. వాస్తవానికి తినేటప్పుడు ఎంతో ప్రశాంతంగా తినాలని చెబుతుంటారు. కాని ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ప్రభావం తీవ్రంగా పడటంతో భోజనం చేసేటప్పుడు కూడా మొబైల్స్ చూసుకుంటూ..  కంగారు కంగారుగా తింటున్నారు. ఇలా చేయడం వల్ల తిన్నది త్వరగా జీర్ణం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  తినేటప్పుడు ఇతర విషయాలపై దృష్టిపెట్టకుండా ప్రశాంత వాతావరణంలో భోజనం చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు భారతీయ సంస్కృతిలో నేలపై కూర్చొని ఆహారం తినడం ఉత్తమంగా చెబుతారు. ఈ విషయం గ్రంథాలలో కూడా ఉందని చెప్తారు. దీని వెనుక లోతైన శాస్త్రం దాగి ఉందని,  నేలపై కూర్చొని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అవెంటో తెలుసుకుందాం.

ఊబకాయం పెరగదు

నేలపై కూర్చొని తినడం వల్ల శరీరం చాలా నిటారుగా ఉంటుంది. దీని వల్ల ఆహారం తిన్నప్పుడు అది నేరుగా జీర్ణాశయం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం దృష్టి ఆహారంపైనే ఉంటుంది. తద్వారా మీరు అతిగా తినకుండా ఉంటారు. దీని వల్ల బరువు అదుపులో ఉండి ఊబకాయం రాదు.

 రక్త ప్రసరణ

నేలపై కూర్చున్నప్పుడు  శరీరంలోని రక్తనాళాలు సక్రమంగా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. ఆహారం వల్ల ఉత్పత్తి అయ్యే రక్తం ఈ గొట్టాల ద్వారా మీ తల నుంచి కాలి వరకు సులభంగా ప్రసరిస్తుంది. మంచం లేదా కుర్చీపై కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఇది జరగదు.

ఇవి కూడా చదవండి

కుటుంబంలో సామరస్యం, ఐక్యత

నేలపై కూర్చొని భోజనం చేస్తే కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. దీంతోపాటు ఆహారం వృథా కాదు. తినే ఆహారం విలువ తెలుస్తుంది. ఇది పాత తరం నుంచి తరువాతి తరానికి అందిస్తున్న సంస్కృతి.

ఎసిడిటీ, గ్యాస్‌ని దూరం చేస్తుంది

నేలపై కూర్చొని భోజనం చేయడం ద్వారా శరీరంలోని జీర్ణవ్యవస్థకు మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ ఏర్పడే సమస్య ఉండదు. దీంతో పాటు ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు రోజూ ఉదయం, సాయంత్రం నేలపై కూర్చొని ఆహారం తీసుకుంటే మీ మోకాళ్లకు వ్యాయామం జరుగుతుంది. అవి మీ శరీర బరువును ఎక్కువసేపు భరించగలవు.

ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది

మీరు ముందుకు వంగి ఆహారం తీసుకొని ఆపై నిటారుగా ఉన్న భంగిమలో రావాలి. ఇలా చేయడం ద్వారా మీరు తిన్న ఆహారం అలిమెంటరీ కెనాల్ ద్వారా నేరుగా జీర్ణవ్యవస్థకు చేరుతుంది. దీని వల్ల కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయటపడతారు. దీనివల్ల వెన్నెముక ఫిట్‌గా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..