Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతున్న అణువును కనుగొన్న శాస్త్రవేత్తలు

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడం లేదా చిక్కపడడం ఎందుకు జరుగుతుంది అనేదానిపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఒక ప్రత్యేకరకమైన అణువు దీనికి కారణం అని వారు అంటున్నారు.

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతున్న అణువును కనుగొన్న శాస్త్రవేత్తలు
Blood Clot In Corona Patients
Follow us

|

Updated on: Jun 24, 2021 | 7:42 PM

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడం లేదా చిక్కపడడం ఎందుకు జరుగుతుంది అనేదానిపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఒక ప్రత్యేకరకమైన అణువు దీనికి కారణం అని వారు అంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఈ అణువు స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల రక్తం గడ్డకట్టే పరిస్థితి వస్తుంది. దీనివలన రోగి మరణించే ప్రమాదం పెరుగుతుంది అని పరిశోధకులు తెలిపారు. ఐర్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధకులు ఏ విషయంపై పరిశోధన నిర్వహించారు. కరోనా రోగులలో రక్తం గడ్డకట్టడం ఎందుకు అని అర్థం చేసుకోవడానికి, డబ్లిన్‌లోని బ్యూమాంట్ ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులపై ఈ పరిశోధనలు జరిగాయి. వారి రక్త నమూనాలను పరిశోధకులు తీసుకున్నారు. ఈ రోగులలో విడబ్ల్యుఎఫ్ అణువు అధిక స్థాయిలో ఉందని రక్త నివేదికలు వెల్లడించాయి. ఈ అణువు రక్తం గడ్డ కట్టడాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా వీరిలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే ADAMTS13 అణువు స్థాయి తక్కువగా ఉంది. ఈ రెండు అణువుల సమతుల్యత క్షీణించినప్పుడు, గడ్డకట్టడం మొదలవుతుంది. ఇలా గద్దకట్టడం మొదలవడం మరణానికి కారణమవుతుందని పరిశోధన రుజువు చేసింది . రక్తం గడ్డకట్టడం వల్ల చాలా మంది కరోనా రోగులు మరణించారని మునుపటి అనేక పరిశోధనలలో రుజువు అయింది.

కరోనా రోగుల ADAMTS13 మరియు VVF స్థాయిని నిర్వహించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమని పరిశోధకుడు డాక్టర్ జామీ ఓసుల్లివన్ చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది, దీని ప్రకారం కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం గురించి ఫిర్యాదు చేసిన 26 అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దుష్ప్రభావాలకు భయపడి చాలా దేశాలు ఈ టీకాను నిలిపివేసాయి. అయినప్పటికీ, కోవిషీల్డ్ దుష్ప్రభావాలు ఈ టీకా యొక్క ప్రయోజనాల కంటే చాలా తక్కువ అని చాలా మంది ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. కోవ్‌షీల్డ్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాన్ని భారతదేశంలో గుర్తించడం ఇదే మొదటిసారి.

మొత్తం 498 కేసులను వారు అధ్యయనం చేసినట్లు మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. వీటిలో, కోవిషీల్డ్ వ్యాక్సిన్ పొందిన తరువాత రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టే అవకాశం ఉన్న 26 కేసులను మాత్రమే వారు కనుగొన్నారు. అదేవిధంగా కోవాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం లేదా రక్తస్రావం సమస్యలు ఏవీ ఇంతవరకూ తెలియలేదు.

Also Read: Maoist Leaders: కారడవుల్లో కరోనా భయం.. తుపాకీ తూటాలను తప్పించుకున్నా… కరోనా రక్కసి మింగేస్తోంది..

Fake vaccination: ముంబైలో భారీగా ఫేక్ వ్యాక్సినేషన్లు… బూటకపు క్యాంపుల్లో రెండు వేలమందికి పైగా టీకా మందు !

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!