Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు ముఖ్య విషయం.. ఇప్పుడు ఈ వ్యాధిని సులువుగా గుర్తించవచ్చు.. కచ్చితమైన ఫలితాలు..

Breast Cancer: మహిళలకు ఇది గుడ్‌న్యూస్‌ అని చెప్పవచ్చు. ఇప్పుడు భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌ను రక్త పరీక్ష ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. నాసిక్‌లోని

మహిళలకు ముఖ్య విషయం.. ఇప్పుడు ఈ వ్యాధిని సులువుగా గుర్తించవచ్చు.. కచ్చితమైన ఫలితాలు..
Breast Cancer
Follow us
uppula Raju

|

Updated on: Nov 21, 2021 | 6:05 AM

Breast Cancer: మహిళలకు ఇది గుడ్‌న్యూస్‌ అని చెప్పవచ్చు. ఇప్పుడు భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌ను రక్త పరీక్ష ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. నాసిక్‌లోని క్యాన్సర్ పరిశోధన సంస్థకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోలర్ నుంచి అనుమతి లభించింది. ఈ పరీక్షలో రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే కణితి కణాలను గుర్తించవచ్చని ఈ పరీక్షను సిద్ధం చేసిన డాటర్ క్యాన్సర్ జెనెటిక్స్ సంస్థ తెలిపింది. భారతదేశంలో దాదాపు 1.7 లక్షల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. వీటిలో చాలా కేసులు క్యాన్సర్ మూడో లేదా నాల్గవ దశలో ఉన్నాయి. ఈ రక్త పరీక్ష ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. భారతదేశంలో ఇది అందుబాటులోకి వస్తుంది.

రక్త పరీక్ష పరీక్ష ఎంత ఖచ్చితమైనది? ఈ అధ్యయనంలో 20 వేల మందికి పైగా మహిళలకు రక్త పరీక్షలు చేశారు. 5ml రక్తాన్ని టెస్ట్‌ కోసం తీసుకున్నారు. ఈ పరీక్ష 99 శాతం వరకు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని సంస్థ పేర్కొంది. 40 ఏళ్లు పైబడిన మహిళలకు రక్త పరీక్షల సహాయంతో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడం దేశంలో ఇదే తొలిసారి. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సకాలంలో సమాచారం అందితే అది పూర్తిగా 99 శాతం వరకు సాధ్యమవుతుంది. ఈ పరీక్ష సహాయంతో క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. అందువల్ల చికిత్స మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. గోప్యత కోసం ఈ పరీక్షను ఇంట్లో కూడా చేయవచ్చు.

భారతదేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఈ రక్త పరీక్ష ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది నాటికి భారత్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ పరీక్షని ‘ఈజీ చెక్’ అని పిలుస్తారు. ఖర్చు చాలా ఎక్కువగా ఉండదు. పరీక్షను అందుబాటులోకి తీసుకురావడానికి వైద్యనిపుణులు ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 ఏళ్ల వయస్సు నుంచి పెరుగుతుందని క్యాన్సర్ నిపుణులు అంటున్నారు. అందుకే ఈ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. మీ కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ టెస్ట్‌ చేయించుకుంటే మంచిది. WHO నివేదిక ప్రకారం గత 20 ఏళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సర్వసాధారణంగా ఉంది. అయితే ప్రస్తుతం దాని స్థానంలో రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది.

తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?