Late Night Eating: మీరు అర్ధరాత్రి సమయంలో తింటున్నారా..? ప్రమాదమే.. పరిశోధనలలో కీలక విషయాలు

Late Night Eating: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బిజీలైఫ్‌ను అనుభవిస్తున్నారు. ఉద్యోగంలో, వ్యాపారాలలో తీరిక లేకుండా బిజీ బిజీగా మారిపోతున్నారు. జీవనశైలిలో మార్పులు..

Late Night Eating: మీరు అర్ధరాత్రి సమయంలో తింటున్నారా..? ప్రమాదమే.. పరిశోధనలలో కీలక విషయాలు
Follow us

|

Updated on: Nov 16, 2021 | 9:55 PM

Late Night Eating: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బిజీలైఫ్‌ను అనుభవిస్తున్నారు. ఉద్యోగంలో, వ్యాపారాలలో తీరిక లేకుండా బిజీ బిజీగా మారిపోతున్నారు. జీవనశైలిలో మార్పులు రావడంతో ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఉద్యోగంలో ఒత్తిడి, మానసిక ఒత్తిళ్లు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో తినడం వంటివి చేస్తుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగడంతో పాటు కొవ్వు పదార్థాలు పెరిగి గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్‌ ఫుడ్‌ అధిక ప్రభావం చూపుతుందని ఇటీవల పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో తేలినింది.

మెదడుపై అధిక ప్రభావం: ఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అని పెద్దలు అంటుంటారు. వేళాపాల లేకుండా ఆహారం తింటే అనారోగ్యం బారిన పడతారనే ఉద్దేశంతో పెద్దలు చెబుతుంటారు. నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలీకుండా బాగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే పరిశోధనల్లో తేలింది. దీని వల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు లేట్‌నైట్‌ జంక్‌ఫుడ్‌ తినే వారిని జాగ్రత్తగా పరిశీలించారు. వారి వివరాలను పొందుపరిచారు. పడుకునే ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైందని గుర్తించారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది. అందుకే అర్ధరాత్రి సమయంలో ఆహారం, స్నాక్స్‌ తీసుకోకపోవడం మంచిదంటున్నారు.

రాత్రుల్లో భోజనం ఆలస్యంగా చేస్తే.. ఇక రాత్రుల్లో ఆలస్యంగా భోజనం చేసినట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు జ్ఞాపకశక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. రాత్రి సమయాల్లో కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Health Benefits: రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగితే అద్భుత ప్రయోజనాలు..!

Thyroid Disease: మహిళలకు థైరాయిడ్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..