Guava: ఆరోగ్యంపై టెన్షన్ ఎందుకు దండగా.. జామ పండు ఉండగా.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వీటిని రోజూ తింటే.. పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి పండ్లలో జమ పండు ముందు వరుసలోనే ఉంటుంది.

Guava: ఆరోగ్యంపై టెన్షన్ ఎందుకు దండగా.. జామ పండు ఉండగా.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Guava Health Benefits
Follow us

|

Updated on: Oct 30, 2022 | 1:01 PM

పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వీటిని రోజూ తింటే.. పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి పండ్లలో జమ పండు ముందు వరుసలోనే ఉంటుంది. జామపండును పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. జామకాయను కోసి దాని ముక్కలకు నల్ల ఉప్పు, కొంచెం మిర్చి అద్ది తింటే ఆ మజానే వేరేలా ఉంటుంది. రుచి పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా జామ ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియం వంటి పోషకాలు జామపండులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనిని ప్రతిరోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే, జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: కడుపు నొప్పితో బాధపడుతున్నా లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే ప్రతిరోజూ ఒక జామపండు తినడం మంచిది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు ఉదయాన్నే కడుపు కూడా సులభంగా శుభ్రం అవుతుంది.
  2. గుండె సమస్యలు దూరం: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జామపండును ఆహారంలో చేర్చుకోవాలి. జామకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  3. ఆరోగ్యకరమైన చర్మం కోసం: ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా జామ పండు చాలా మేలు చేస్తుంది. జామలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
  4. బరువు తగ్గేలా చేస్తుంది: ఎక్కువ ఆకలిగా అనిపించినా లేదా తీపి ఆహారం తినాలన్న కోరిక ఉంటే జామపండు తినడం ప్రారంభించండి. దీన్ని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉండి ఏమీ తినాలని అనిపించదు. దీంతో మీకు చిరుతిండి కోరికలు కూడా దూరమై.. బరువు నియంత్రణలో ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. యాక్టివ్‌గా ఉంచుతుంది: మీకు మార్నింగ్ సిక్‌నెస్ ఉంటే.. కచ్చితంగా జామపండు తినాలి. దీని కారణంగా మీ శరీరం చురుకుగా మారుతుంది. ఇది మానసిక స్థితిని కూడా చక్కగా ఉంటుంది. చురుకుగా ఉండటానికి, ఇతర పండ్లతో పాటు జామ పండ్లను కూడా రెగ్యులర్ గా తినండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు