AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutrition Food: పోషకాహార లోపంతో ఉన్నవారికి కరోనా తేలికగా వ్యాప్తిస్తుంది.. మరణకారకంగానూ మారుతుంది..పరిశోధనల్లో వెల్లడి!

పోషకాహార లోపం కరోనా ప్రమాదాన్ని పెంచుతుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. జీవితంలో ఏదో ఒక సమయంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు,పెద్దలు సంక్రమణ సంభవిస్తే మరణించే ప్రమాదం ఉంది.

Nutrition Food: పోషకాహార లోపంతో ఉన్నవారికి కరోనా తేలికగా వ్యాప్తిస్తుంది.. మరణకారకంగానూ మారుతుంది..పరిశోధనల్లో వెల్లడి!
Nutrition Food
KVD Varma
|

Updated on: Jul 27, 2021 | 1:20 PM

Share

పోషకాహార లోపం కరోనా ప్రమాదాన్ని పెంచుతుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. జీవితంలో ఏదో ఒక సమయంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు,పెద్దలు సంక్రమణ సంభవిస్తే మరణించే ప్రమాదం ఉంది. దీనిలో సంక్రమణ తీవ్రమైన రూపాన్ని తీసుకోవచ్చు. వెంటిలేటర్ అవసరం కావచ్చు. ఆరెంజ్ కంట్రీలోని కాలిఫోర్నియా చిల్డ్రన్స్ హాస్పిటల్ పరిశోధకులు ఈ వాదనను పరిశోధనలో చేశారు.

పోషకాహార లోపం, కరోనా మధ్య సంబంధం ఇదీ..

పరిశోధకులు, పోషకాహార లోపం రోగాలపై పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వైరస్ శరీరానికి సోకినప్పుడు పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. పోషకాహార లోపం ప్రభావం శరీరంపై ఎక్కువసేపు ఉంటుందని, అందువల్ల రోగనిరోధక శక్తి కూడా దాని నుండి బయటపడేయలేదని పరిశోధనలు చెబుతున్నాయి.

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 18 నుండి 78 సంవత్సరాల వయస్సు గలవారు  జీవితకాలంలో ఒకసారి అయినా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారిలో తీవ్రమైన కరోనా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంది. పరిశోధకులు చెబుతున్న దాని  ప్రకారం, పిల్లలు, వృద్ధులలో పోషకాహార లోపం ఒక ప్రధాన సమస్య. ఇది కరోనా ప్రమాదాన్ని పెంచుతుంది.

1 లక్ష మందిపై చేసిన పరిశోధన

పోషకాహార లోపం మరియు కరోనా మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి, 8,604 మంది పిల్లలు, 94,495 మంది పెద్దలపై పరిశోధన జరిగింది. కరోనా సంక్రమణ తర్వాత వీరందరినీ మార్చి, జూన్ నెలల్లో అమెరికాలోని ఆసుపత్రులలో చేర్పించారు. 2015 , 2019 మధ్య వచ్చిన పోషకాహార లోపం ఉన్న రోగులతో పోల్చిన తరువాత పరిశోధన ఫలితాలు విడుదలచేశారు.

ఈ పరిశోధన భారతదేశానికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే …

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 2019 నివేదిక రాష్ట్రాలలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణానికి పోషకాహార లోపం ప్రధాన కారణమని పేర్కొంది. అంటే, ఇక్కడ పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు చాలా ఎక్కువ ఉన్నారని తెలుస్తోంది.

2017 లో, పోషకాహార లోపం కారణంగా దేశంలో ఐదేళ్లలోపు 10.4 లక్షల మంది పిల్లలు మరణించారు. ఆకలిని పరిష్కరించడంలో భారత్ బాగా పని చేయడం లేదని, ఆకలిని పరిష్కరించడంలో అవరోధాలు, పురోగతిని వివరించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 నివేదిక పేర్కొంది. అందువల్ల కరోనా వ్యాప్తిని నిరోధించడం విషయంలో భారత్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పవచ్చు.

Also Read: Skin Cancer: చర్మ సంబంధ కేన్సర్‌ను యాంటీ బయాటిక్స్ సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.. తాజా పరిశోధనల్లో వెల్లడి 

Good News on Corona: శుభవార్త! గాలిలో కరోనా వైరస్ పనిపెట్టే లేజర్ పరికరం సిద్ధం చేసిన పరిశోధకులు