AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన ‘గీతగోవిందం’.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

సుమారు ఎనిమిదేళ్ల క్రితం గీత గోవిందం సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. అప్పుడు రీల్ లైఫ్ లో జంటగా నటించిన వీరిద్దరూ ఇప్పుడు నిజ జీవితంలోనూ భార్య భర్తలు అయ్యారు. అగ్రి మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు.

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన 'గీతగోవిందం'.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Wedding Of Virosh
Basha Shek
|

Updated on: Mar 05, 2026 | 5:13 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ వేదికగా వీరి పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్. ఇక బుధవారం (మార్చి 04న) ఈ కొత్త దంపతులు వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం విజయ్- రష్మికల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు, సినీ అభిమానులు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా విజయ్, రష్మికలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్ల క్రితం రిలీజైన గీత గోవిందం సినిమాతోనే వీరి ప్రేమకు పునాది పడింది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాతోనే విజయ్-రష్మికల పరిచయం మొదలైంది. సినిమా అయిపోయే సరికి మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. ఆ తర్వాత డియర్‌ కామ్రేడ్‌ సినిమా షూటింగ్ లోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. రష్మికతో ప్రేమ గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడిన విజయ్ రష్మికనే తనకు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేసిందని తెలిపింది.

మొత్తానికి అటు రష్మికకు, ఇటు విజయ్ కు కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగానూ గీత గోవిందం సినిమా బాగా కలిసొచ్చింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి హీరోయిన్ గా రష్మిక మందన్నా ఫస్ట్ ఛాయిస్ కాదంట. ఆమె కంటే ముందు చాలామంది హీరోయిన్స్‌ దగ్గరకు ఈ మూవీ వెళ్లిందట! అందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా కూడా ఒకరు. ఇటీవలే సీతా పయనం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార గీత గోవిందం సినిమాను ఎలా మిస్ చేసుకున్నానో స్వయంగా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

సీతా పయనం మూవీ ప్రమోషన్లలో ఐశ్వర్య సర్జా..

‘ సీతా పయనం కంటే ముందు నాకు తెలుగులో గీత గోవిందం ఆఫర్‌ వచ్చిందని తెలిపింది. నేను చేయని ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. తెలుగులో ‘గీత గోవిందం’ కథ విన్నాను. కానీ, ఎందుకో అది కుదర్లేదు. ఇది చాలామంది హీరోయిన్ల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. ఏదేమైనా చివరకు సినిమా అద్భుతంగా వచ్చింది’ అని పేర్కొంది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us