AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: నా కొడుకును బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు.. అతని పప్పులుడకవ్‌: విజయ్ దేవరకొండ తండ్రి

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నటించిన ఖుషి సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. శివనిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సమంత హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్‌ 1 న విడుదలైన ఖుషి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తన ఆనందాన్ని అభిమానులతో షేర్‌ చేసుకునే ఉద్దేశంతో హీరో విజయ్‌ ఫ్యాన్స్‌కు ఒక బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు బహమతిగా ఇస్తానని తెలిపాడు. దీంతో విజయ్‌ అభిమానులు తెగ మురిసిపోయారు.

Vijay Devarakonda: నా కొడుకును బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు.. అతని పప్పులుడకవ్‌: విజయ్ దేవరకొండ తండ్రి
Vijay Devarakonda And His Family
Basha Shek
|

Updated on: Sep 09, 2023 | 4:36 PM

Share

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నటించిన ఖుషి సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. శివనిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సమంత హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్‌ 1 న విడుదలైన ఖుషి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తన ఆనందాన్ని అభిమానులతో షేర్‌ చేసుకునే ఉద్దేశంతో హీరో విజయ్‌ ఫ్యాన్స్‌కు ఒక బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు బహమతిగా ఇస్తానని తెలిపాడు. దీంతో విజయ్‌ అభిమానులు తెగ మురిసిపోయారు. తమ హీరోది మంచి మనసు అంటూ నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ విజయ్‌ ఈ ఆఫర్‌ ప్రకటించిన వెంటనే ఓ నిర్మాణ సంస్థ హీరోపై విమర్శలకు దిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ, పంపిణీదారు అయిన అభిషేక్‌ పిక్చర్స్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం, దీనిపై ఎవరూ స్పందించట్లేదు. ఎలాగో మీరు వంద కుటుంబాలకు కోటి ఇస్తామంటున్నారు. అలాగే మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌ కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం’ అని హీరోకు కౌంటర్‌ ఇచ్చారు. దీనిపై విజయ్‌ అభిమానులు అభిషేక్‌ పిక్చర్స్‌పై గుర్రుగా ఉన్నారు. ఇలా పబ్లిక్‌గా డిమాండ్‌ చేయడం సరైన పద్దతి కాదంటూ అభిషేక్‌కు హితవు పలుకుతున్నారు.

కోర్టుకెళ్లాల్సింది..

తాజాగా ఈ వ్యవహారంపై విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్దన్‌ రావు స్పందించాడు. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా ఫెయిల్‌ అయినప్పుడు విజయ్‌ తన పారితోషకంలో సగం వెనక్కు ఇచ్చేశాడు. తనకు ఇస్తానన్న ఫ్లాట్‌ కూడా వద్దన్నాడు. ఇంతకంటే ఏం చేయాలి. అయినా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టాలు వస్తే విజయ్‌ ఏం చేస్తాడు? అది నిర్మాతలతో తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పుడే కాదు.. అభిషేక్‌ చాలా కాలంగా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. మేం అతనితో మాట్లడుతున్న విషయం విజయ్‌కు కూడా తెలియదు. అలాంటిది డైరెక్టుగా సోషల్ మీడియాలో నా కుమారుడి పేరు ప్రస్తావించాడు. ఇది చాలా బాధాకరం. ఒకవేళ నిజంగా మేం అతనికి డబ్బులివ్వాల్సి ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సి ఉంది.

ఇకపై అభిషేక్‌తో సినిమాలు చేయడు..

‘అభిషేక్‌ నా కొడుకును ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌ చేయాలని చేస్తున్నాడు. అయితే ఇప్పటి నుంచి అతని పప్పులేమీ ఉడకవు. ఒక సారేమో నా కుమారుడి మార్కెట్‌ బాగా పడిపోయిందంటాడు. ఇంకోసారేమో విజయ్‌ దేవరకొండతో సినిమా తీస్తాను. అతని డేట్స్‌ కావాలంటాడు.  అభిషేక్ మాటలు, చేతలకు పొంతన ఉండదు. అయినా విజయ్‌ ఇప్పటికే దిల్‌ రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్లకు సంతకాలు చేశాడు. అభిషేక్‌ నామాతో సినిమాలు చేయడు’ అని చెప్పుకొచ్చారు గోవర్ధన్‌ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.