AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలా..!! రెండు సార్లు పెళ్లి.. నరకం చూపించిన ఇద్దరు భర్తలు.. చివరకు

సినీ చరిత్రలో ఒక ధృవతారగా వెలుగొందిన సీనియర్ నటి రాజసులోచన, బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. కేవలం నాట్యం, సినిమాలతో పాటు కార్ డ్రైవింగ్, బోట్ రైడింగ్ లలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. విజయవాడలో జన్మించి, మద్రాసులో పెరిగిన ఆమె, తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో 300కు పైగా చిత్రాలలో నటించారు.

స్టార్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలా..!! రెండు సార్లు పెళ్లి.. నరకం చూపించిన ఇద్దరు భర్తలు.. చివరకు
Raja Sulochana
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2026 | 8:59 AM

Share

భారతీయ సినీ చరిత్రలో ఆమె ఓ ధృవతార.. తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి అగ్ర కథానాయికగా నిలిచింది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి రాజసులోచన. ఈ తరం ప్రేక్షకులకు ఆమె గురించి తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో ఆమె తిరుగులేని హీరోయిన్. నాట్య, సినీ రంగాలతో పాటు కార్ డ్రైవింగ్, బోట్ రైడింగ్ లలో సైతం ఆమె గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టి, మద్రాసులో పెరిగిన రాజా సులోచన, వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రెండు వివాహాలు, వృత్తిపరమైన ఆటుపోట్లను అధిగమిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 300కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు రాజసులోచన.

ఇది కూడా చదవండి :

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

ఈ అందాల తార అసలు పేరు రాజీవలోచన కాగా, స్కూల్ రిజిస్టర్‌లో పొరపాటున రాజసులోచన అని నమోదు కావడంతో అదే పేరు ఆమెకు స్థిరపడింది. రాజసులోచనకు చిన్నతనం నుంచే నాట్యం అంటే అపారమైన ఆసక్తి ఉండేది. కళాభిమాని అయిన ఆమె మేనమామ స్థాపించిన సుగుణ విలాస సభ నాటక, నృత్య ప్రదర్శనలు ఆమెకు ప్రేరణనిచ్చాయి. ఏడేళ్ల వయసులో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టినా, ఆమె దృష్టి ఎక్కువగా నృత్యం పైనే ఉండేది. మూడో ఫారంలోనే చదువు మానేసి, 13వ ఏట స్టేజీపై తొలిసారి అరంగేట్రం చేశారు. నృత్యం నేర్పే క్రమంలో ఆమెకు పరమశివం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. తల్లిదండ్రుల అంగీకారం లేకపోయినా, 1951 సెప్టెంబర్ 11న కరుణానిధి సమక్షంలో పరమశివంతో ఆమె వివాహం జరిగింది. 1952లో కె.ఎస్. ప్రకాశరావు తన కన్నతల్లి చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ నటించిన సొంతవూరు చిత్రంలో హీరోయిన్ గా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత మాంగల్య బలం, రాజమకుటం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి అగ్రతారగా ఎదిగారు.

ఇది కూడా చదవండి :

Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్

నటిగా బిజీ అయిన రాజసులోచన, వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్త పరమశివం వేధింపులు భరించలేక, ఆయనకు విడాకులిచ్చి కుమారుడితో ఒంటరిగా జీవనం సాగించారు. ఈ కష్టకాలంలో దర్శకుడు సి.ఎస్.రావులోని మంచితనాన్ని గమనించి ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. సి.ఎస్.రావు అప్పటికే వివాహితుడై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, రాజసులోచనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1963 మేలో గురువాయూరులో వారి వివాహం జరిగింది. ఈ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇది ఆ రోజుల్లో అరుదైన వార్తగా నిలిచింది. రాజసులోచన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ప్రేమ్ నజీర్, రాజ్ కుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. అయితే సి.ఎస్.రావుతో కూడా విబేధాల కారణంగా ఆమె విడిపోయారు. తన జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న రాజసులోచన 2013 మార్చి 5న తుదిశ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

బాప్రే బాప్..! ఇదెక్కడి సిరీస్ రా మావ.. మెంటలెక్కిస్తుంది..!! ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us