Venkatesh: రెమ్యునరేషన్ పెంచేసిన వెంకీమామ..సైంధవ్ కోసం వెంకటేష్ ఎంత అందుకోనున్నాడంటే..
ఇటీవలే వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ.. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. వెంకటేష్ ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ.. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా సైంధవ్ మూవీ రానుంది. ఈ సినిమా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఉండబోతోందనీ తెలుస్తోంది. ఇటీవలే హిట్ 2 సినిమాతో శైలేష్ మంచి హిట్ అందుకున్నాడు. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం వెంకటేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వెంకటేష్ ఈ సినిమాకోసం భారీగా ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. గత సినిమాల కంటే ఈ సినిమాకు వెంకీ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
సైంధవ్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో రానుంది. కాగా ఈ సినిమా కోసం వెంకీ..వెంకటేష్ ఏకంగా 17 కోట్లు చార్జ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.