Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. వీలైనంత త్వరగా తన చిత్రాలను పూర్తిచేసి.. కొత్త సినిమాలను

Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా... థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్...
Suirya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 9:06 PM

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. వీలైనంత త్వరగా తన చిత్రాలను పూర్తిచేసి.. కొత్త సినిమాలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశాడు చిరు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చిరు సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మరో స్టార్ హీరో పోటీ ఇవ్వబోతున్నాడు.

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం నటిస్తున్న ఎదుర్కుమ్ తునిందవన్ మూవీ.. చిరు సినిమాకు పోటీ ఇవ్వబోతుంది. ఇప్పటివరకు సూర్య నటించిన రెండు చిత్రాలు ఓటీటీలోనే విడుదలకాగా… ఈ సినిమాను మాత్రం థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. హీరో సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ ప్రేక్షకులు సూర్యకు వీరాభిమానులు. ఇటీవల జైభీమ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూర్య.. ప్రశంసలు అందుకున్నాడు. అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ మూవీ హిట్ కావడమే కాకుండా.. సూర్య నటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక మొత్తానికి ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Also Read: Rashi Khanna: రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్..  పరుగుల జీవితం నుంచి  అంటూ.. 

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్