AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాస్మా డొనేట్ చేసిన శేఖర్ మాస్టర్

కరోనా జయించినవారికి ప్రాణ దాతలుగా మారే గొప్ప అవకాశం ఉంది. ప్లాస్మా దానం చేయడం ద్వారా మరో కోవిడ్ బాధితుడి ప్రాణం నిలబెట్టవచ్చు.

ప్లాస్మా డొనేట్ చేసిన శేఖర్ మాస్టర్
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2020 | 8:03 PM

Share

కరోనా జయించినవారికి ప్రాణ దాతలుగా మారే గొప్ప అవకాశం ఉంది. ప్లాస్మా దానం చేయడం ద్వారా మరో కోవిడ్ బాధితుడి ప్రాణం నిలబెట్టవచ్చు. అవును కరోనా  చికిత్సలో ప్లాస్మా ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీంతో ప్రభుత్వాలు, డాక్టర్లు, అధికారులు ప్లాస్మా దానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి ప్లాస్మా దానంపై అవగాహన పెంచుతున్నారు. తాజాగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

గత నెలలో తనకు కరోనా సోకగా కిమ్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు తన శరీరంలో యాంటీ బాడీస్ పెరిగినందున ప్లాస్మాను డొనేట్ చేసినట్లు చెప్పారు. వైద్యుల సమక్షంలో 400 మి.లీ ప్లాస్మాను డొనేట్ చేశానని.. తాను దానం చేసిన ప్లాస్మా ద్వారా ఇద్దరి నుంచి ముగ్గురు రక్షించబడతారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారు విధిగా ప్లాస్మాదానం వైపు అడుగులు వేయాలని కోరారు.

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !