Virata Parvam: ఆమె విప్లవాన్ని ప్రేమించింది.. దాని వల్లే చనిపోయింది.. విరాటపర్వంపై సరళ అన్నయ్య కామెంట్స్..

సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనలను ప్రేరణగా తీసుకుని వెన్నెల పాత్రలో ఈ చిత్రాన్ని నడిపించారు. ఇందులో సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో

Virata Parvam: ఆమె విప్లవాన్ని ప్రేమించింది.. దాని వల్లే చనిపోయింది.. విరాటపర్వంపై సరళ అన్నయ్య కామెంట్స్..
Virata Parvam
Follow us

|

Updated on: Jun 19, 2022 | 8:10 AM

బాక్సాఫీస్ వద్ద విరాటపర్వం (Virata Parvam) హావా కొనసాగుతుంది. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వేణు ఉడుగుల. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనలను ప్రేరణగా తీసుకుని వెన్నెల పాత్రలో ఈ చిత్రాన్ని నడిపించారు. ఇందులో సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించగా.. డి. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. జూన్ 17న విడుదలైన ఈ మూవీకి ముందు నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఈ క్రమంలో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది.. దానిపై ఇష్టంతో వెళ్ళి.. దాని వల్లే చనిపోయిందన్నారు సరళ అన్నయ్య తూము మోహన్ రావు..

తూము మోహన్ రావు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఉడుగుల గారు కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి గారి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్ళింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్ళినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వలనే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు.

మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. నా భార్య ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. సాయి పల్లవి, రానా లేకపోతే ఈ సినిమా లేదు. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం వుండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా వుంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్ లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా గారు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.