Samantha: ఓకే యూనివర్స్.. నేను రెడీగా ఉన్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. మొదటి సినిమాతోనే
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సామ్. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట 2021లో విడాకులు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ఇక విడాకుల అనంతరం సామ్ తన కెరీర్ పై దృష్టి సారించింది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదుర్స్ అనిపించుకుంది సామ్. ఇటీవలే యశోధ మూవీకి సంబంధించిన షెడ్యూల్ను పూర్తిచేసింది. అటు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది సమంత. ఇప్పటికే డ్రీమ్ వారియర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ మూవీ చేస్తుంది. ఓవైపు సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తూ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటోంది సామ్.
గత కొన్ని రోజులుగా మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తుంటుంది. సద్గురు మాట్లాడిన మోటివేషన్ కోట్స్ వీడియోస్ షేర్ చేస్తుంది. సామ్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సమంత తన ఇన్ స్టా ఖాతాలో మరో పోస్ట్ చేసింది. “ఓకే యూనివర్స్.. ఇక మంచిని తీసుకునేందుకు .. ఫీల్ అయ్యేందుకు నేను రెడీగా ఉన్నాను. నేను మంచిగా ఫీల్ అయ్యేలా చేయ్ ” అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక సామ్ చేసిన పోస్ట్ చూస్తుంటే.. ఈ ఏడాది తనకంతా మంచి జరగాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో యశోధ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి కొడుకు.. దర్శకుడు ఎవరంటే..
Rana Daggubati : మరో రీమేక్ను లైన్లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..