AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారి పూర్తి వందేమాతరం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం!

న్యూఢిల్లీలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 27 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేడుకలకు యువ ఆవిష్కర్తలు, ఇంటర్న్‌లు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారని తెలిపారు. వీటి గురించి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి సింగ్ వెల్లడించారు.

Prasanna Yadla
|

Updated on: Aug 11, 2026 | 12:36 PM

Share
ప్రతి ఏటా వేరు ఈ యేడు జండా వందనం వేరు. న్యూఢిల్లీలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు  27 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేడుకలకు యువ ఆవిష్కర్తలు, ఇంటర్న్‌లు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారని తెలిపారు. వీటి గురించి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి సింగ్ వెల్లడించారు.

ప్రతి ఏటా వేరు ఈ యేడు జండా వందనం వేరు. న్యూఢిల్లీలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 27 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేడుకలకు యువ ఆవిష్కర్తలు, ఇంటర్న్‌లు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారని తెలిపారు. వీటి గురించి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి సింగ్ వెల్లడించారు.

1 / 5
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు వెళ్లిన తరవాత వందేమాతరం గీతాన్ని ఈ సారి పూర్తిస్థాయిలో ఆలపించే కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఆ తరవాత ప్రధాని జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆహ్వాన పత్రికల్లో కూడా  వందేమాతరం గీతం పూర్తి సాహిత్యాన్ని ముద్రించారు. దీంతో వేడుకలకు వచ్చినవారు కూడా గీతాన్ని కలిసి ఆలపించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు వెళ్లిన తరవాత వందేమాతరం గీతాన్ని ఈ సారి పూర్తిస్థాయిలో ఆలపించే కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఆ తరవాత ప్రధాని జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆహ్వాన పత్రికల్లో కూడా వందేమాతరం గీతం పూర్తి సాహిత్యాన్ని ముద్రించారు. దీంతో వేడుకలకు వచ్చినవారు కూడా గీతాన్ని కలిసి ఆలపించనున్నారు.

2 / 5
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రెండు ముఖ్యమైన అంశాల చుట్టూ  నిర్వహించనున్నారు. అవి వందేమాతరం 150 ఏళ్లు , ‘విక్షిత్ భారత్@2047 కోసం యువశక్తి’. జంతర్ మంతర్ వద్ద ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలతో సంబంధం లేకుండానే యువశక్తిని వేడుకల థీమ్‌గా ముందుగానే అనుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రెండు ముఖ్యమైన అంశాల చుట్టూ నిర్వహించనున్నారు. అవి వందేమాతరం 150 ఏళ్లు , ‘విక్షిత్ భారత్@2047 కోసం యువశక్తి’. జంతర్ మంతర్ వద్ద ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలతో సంబంధం లేకుండానే యువశక్తిని వేడుకల థీమ్‌గా ముందుగానే అనుకున్నట్లు అధికారులు తెలిపారు.

3 / 5
వందేమాతరం గీతానికి ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేక స్థానం కల్పించబోతున్నారు. జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందుగా కొన్ని కార్యక్రమాల్లో వందేమాతరం గీతంలోని ఆరు చరణాలను ఆలపించేందుకు ముందుగానే నిబంధనలు కూడా జారీ చేసింది.

వందేమాతరం గీతానికి ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేక స్థానం కల్పించబోతున్నారు. జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందుగా కొన్ని కార్యక్రమాల్లో వందేమాతరం గీతంలోని ఆరు చరణాలను ఆలపించేందుకు ముందుగానే నిబంధనలు కూడా జారీ చేసింది.

4 / 5
 జాతీయ గీతానికి సమాన హోదా కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన జాతీయ గౌరవానికి అవమానాల నివారణ  బిల్లు–2026 ను పార్లమెంటు ఆమోదించింది. జాతీయ గీతాన్ని అడ్డుకోవడం లేదా అవమానించడం ఎవరైనా చేస్తే శిక్ష ఖరారు చేసే నిబంధనలు ఉన్నాయి. నేరాలకు మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే ప్రతిపాదన ఉంది.

జాతీయ గీతానికి సమాన హోదా కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన జాతీయ గౌరవానికి అవమానాల నివారణ బిల్లు–2026 ను పార్లమెంటు ఆమోదించింది. జాతీయ గీతాన్ని అడ్డుకోవడం లేదా అవమానించడం ఎవరైనా చేస్తే శిక్ష ఖరారు చేసే నిబంధనలు ఉన్నాయి. నేరాలకు మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే ప్రతిపాదన ఉంది.

5 / 5
Follow Us