AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయని తెలుసు.. సమంత లేటేస్ట్ పోస్ట్ వైరల్..

సమంత (Samantha) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. విడాకుల అనంతరం మోటివేషనల్స్ కోట్స్ షేర్ చేస్తూ మానసిక

Samantha: ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయని తెలుసు.. సమంత లేటేస్ట్ పోస్ట్ వైరల్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2022 | 10:52 AM

Share

సమంత (Samantha) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. విడాకుల అనంతరం మోటివేషనల్స్ కోట్స్ షేర్ చేస్తూ మానసిక పరిస్థితి గురించి చెబుతూ వస్తోన్న సామ్.. ఇటీవల ఉక్రెయిన్.. రష్యా యుద్ధంపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే.. తను ప్రతిరోజూ చేసే జిమ్ వర్కవుట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంది. ఇటీవల తన జిమ్ వర్కవుట్ వీడియోస్ నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సమంత ప్రస్తుతం తన పెట్స్‏తో ఎంత సంతోషంగా ఎంజాయ్ చేస్తుందో తెలిసిన విషయమే. సమంత ఫోటోస్.. వీడియోస్ షేర్ చేసినప్పుడు కచ్చితంగా పెట్స్ కనిపిస్తుంటాయి. తాజాగా తన పెట్స్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది సామ్. తను జిమ్ లో వర్కవుట్స్ చేస్తుంటే.. అవి చేసే అల్లరి గురించి చెప్పుకొచ్చింది. సమంత దగ్గర ప్రస్తుతం రెండు కుక్క పిల్లలు ఉన్నాయి. అవి హాష్, సాషాలు.

Samantha

Samantha

అయితే హష్ తన వద్దకు చాలా సంవత్సరాలు అవుతుంది.. ఇక సాషా ఈ మధ్య వచ్చింది. మొదట్లో ఈ రెండింటికీ అస్సలు పడేది కాదట. కానీ ఆ తర్వాత రెండు కలిసిపోయాయంటూ చెప్పింది. జీవితంలో సిబ్లింగ్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయని.. ఈ రెండింటి మధ్య గొడవలు వస్తాయని తనకు తెలుసంటూ పోస్ట్స్ చేసింది. సమంత ప్రస్తుతం యశోధ సినిమాలో నటిస్తోంది.

Also Read: Telugu Indian Idol Episode 3: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 3.. ఎవరు గోల్డెన్ మైక్ అందుకున్నారంటే..

Anand Mahindra: డైరెక్టర్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. ప్రభాస్ సినిమాకు సపోర్ట్ చేస్తామంటూ..

Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..

మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..