AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oliviak Morris: హైదరాబాద్ పానీ పూరికి ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఫిదా.. వీధుల్లో సందడి చేసిన హాలీవుడ్ హీరోయిన్..

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్

Oliviak Morris: హైదరాబాద్ పానీ పూరికి ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఫిదా.. వీధుల్లో సందడి చేసిన హాలీవుడ్ హీరోయిన్..
Oliviak Morris
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2021 | 6:50 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా గురించి అటు తారక్, ఇటు చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా… జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో చరణ్ సరసన నటిస్తుండగా.. హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ పాత్రలు, వారికి సంబంధించిన ఫస్ట్‏లుక్ విడుదలై నెట్టింట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తిచేసుకున్నా.. ఇప్పటివరకు హీరోయిన్ ఒలివియాకు సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో అభిమానులు ఆమెకు సంబంధించిన లుక్, రోల్ డీటెయిల్స్ కోసం సోషల్ మీడియాలో వెతుకులాట ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒలివియా హైదరాబాద్ వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఒలివియా… షూట్ ముగియండంతో ఆమె శనివారం సాయంత్రం హైదరాబాద్ వీధుల్లో సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ కస్ట్యూమ్ డిజైనర్ అనురెడ్డితో కలిసి ఆమె శిల్పారామం వెళ్లారు. అక్కడి వీధుల్లో తిరుగుతూ.. హస్తకళలు, ప్రకృతి అందాలకు ఆమె ముగ్దులయ్యారు. అంతేకాదు.. అనురెడ్డితో కలిసి హైదరాబాద్ పానీపూరీని రుచి చూశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఒలివియా తన ఇన్‏స్టాలో షేర్ చేశారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Olivia (@oliviakmorris)

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‏తో డీవీవీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రియా శరణ్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‏గణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోలు, దోస్తీ సాంగ్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టించారు.

Also Read: Krithi Sanon: ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలను చెప్పిన స్టార్ హీరోయిన్.. అందరూ అనుకునేవి నిజం కాదంటూ..

Shanmukh Jaswanth: ఇది ప్రమోషనల్ పోస్ట్ కాదంటునే ఆ సంస్థపై పొగడ్తల వర్షం కురిపించిన షణ్ముఖ్.. జాగ్రత్త అంటున్న నెటిజన్స్..