Virata Parvam Trailer : ”ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది”.. ఆకట్టుకుంటోన్న ‘విరాట పర్వం’ ట్రైలర్

దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాట పర్వం(Virata Parvam). 'నీది నాది ఒకే కథ' సినిమాతో డీసెంట్‌ హిట్‌ను అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Virata Parvam Trailer : ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. ఆకట్టుకుంటోన్న విరాట పర్వం ట్రైలర్
Virata Parvam

Updated on: Jun 05, 2022 | 6:44 PM

దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాట పర్వం(Virata Parvam). ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో డీసెంట్‌ హిట్‌ను అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తికాగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

విరాట పర్వం ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. సాయి పల్లవి మరోసారి తన నటనతో కట్టిపడేస్తుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. రానా మరోసారి పవర్ ఫుల్ పాత్రతో ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి భావజాలను ఇష్టపడి.. అతడిని ప్రేమించే యువతి వెన్నెలగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా కనిపించనున్నాడు. సాయిపల్లవితో పాటు ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. 1990ల నాటి నక్సలిజం నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ విరాట పర్వం.

ఇవి కూడా చదవండి