Rajinikanth Birthday: రజినీకాంత్ కోసం ఏడు రోజులు ఉపవాసం ఉన్న శ్రీదేవి.. ఎందుకో తెలుసా..

ఫ్యాన్స్ ముద్దుగా తలైవా అని పిలుచుకునే రజినీ పుట్టిన రోజు నేడు. 72 ఏళ్ల వయసున్న ఈ స్టార్ హీరో.. ఇప్పటికీ విరామం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కెరీర్‏లో ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రజినీ.

Rajinikanth Birthday: రజినీకాంత్ కోసం ఏడు రోజులు ఉపవాసం ఉన్న శ్రీదేవి.. ఎందుకో తెలుసా..
Rajinikanth Sridevi
Follow us

|

Updated on: Dec 12, 2022 | 10:46 AM

సూపర్ స్టార్ రజినీ కాంత్.. సౌత్‏లోనే కాదు.. నార్త్‏లోనూ అత్యంత క్రేజ్ ఉన్న తారలలో ఒకరు. ఆయన స్టైల్ అండ్ యాటిట్యూడ్‏కు ఇప్పటి యువత కూడా ఫిదా కావాల్సిందే. ఓ సామాన్య వ్యక్తిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి చిన్న చిన్న విషాలతో వెండితెరపై సందడి చేసి.. తక్కువ సమయంలోనే సూపర్ స్టార్‏గా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్స్.. బాక్సాఫీస్‏ను షేక్ చేసిన చిత్రాలు.. యాక్షన్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక చిత్రాలతోనూ మెప్పించారు. ఫ్యాన్స్ ముద్దుగా తలైవా అని పిలుచుకునే రజినీ పుట్టిన రోజు నేడు. 72 ఏళ్ల వయసున్న ఈ స్టార్ హీరో.. ఇప్పటికీ విరామం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కెరీర్‏లో ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రజినీ. కానీ ఓ హీరోయిన్ మాత్రం సూపర్ స్టార్ కోసం ఏకంగా 7 రోజులు ఉపవాసం ఉన్నారట. ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఎందుకు ఉపవాసం ఉంది ? తెలుసుకుందామా .

సూపర్ స్టార్ రజినీ కాంత్ కోసం ఏకంగా ఏడు రోజులు ఉపవాసం ఉన్న హీరోయిన్ మరెవరో కాదు… అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవి. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 25 సినిమాలు వచ్చాయి. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో వీరిద్దరు కలిసి నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఫరిష్టే.. చాల్ బాజ్, భగవాన్ దాదా, జుల్మ, గెర్ లేగీ వంటి చిత్రాలు నటించారు. అయితే తన కోసం శ్రీదేవి 7 రోజులు ఉపవాసం ఉండి దీక్ష చేసిందని రజినీ స్వయంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 2011 సంవత్సరంలో రజినీ ప్రధాన పాత్రలో రానా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను చికిత్స కోసం సింగపూర్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలియగానే శ్రీదేవి మనోవేదనకు గురయ్యారు. రజినీ ఆరోగ్యం మెరుగుపడేందుకు షిర్డీ వెళ్లారు.

ఇవి కూడా చదవండి

షిర్డీని సందర్శించిన తర్వాత ఆయన కోసం 7 రోజులపాటు నిరాహార దీక్ష చేశరు. రజినీ కోలుకోవడానికి నిత్యం దైవాన్ని స్మరించుకున్నారట. ఇక కొద్ది రోజులకు రజినీ పూర్తిగా కోలుకుని భారత్ కు తిరిగివచ్చిన వెంటనే.. తన భర్త బోనీ కపూర్ తో కలిసి తలైవా ను చూసేందుకు వెళ్లారట. రజినీని తిరిగి మాములుగా చూసి శ్రీదేవి భావోద్వేగానికి గురయ్యారట.