Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: ప్రభాస్‌ ఇష్యూ మానసికంగా ట్రబుల్‌ చేసింది.. కీలక కామెంట్స్ చేసిన నిత్యామీనన్

నిత్యామీనన్.. దక్షణాది భాషల్లో పరిణితి చెందిన నటి. బ్యూటీ విత్ బ్రెయిన్ అనడానికి ఈమె ఎగ్జాంపుల్. తనకు మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తారు నిత్య.

Nithya Menen: ప్రభాస్‌ ఇష్యూ మానసికంగా ట్రబుల్‌ చేసింది.. కీలక కామెంట్స్ చేసిన నిత్యామీనన్
Nithya Menen Prabhas
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2021 | 8:36 AM

నిత్యామీనన్.. దక్షణాది భాషల్లో పరిణితి చెందిన నటి. బ్యూటీ విత్ బ్రెయిన్ అనడానికి ఈమె ఎగ్జాంపుల్. తనకు మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తారు నిత్య. అందుకే ఆమెపై మూవీ లవర్స్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తెలుగులో ‘అలా మొదలైంది’ మూవీతో ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసిన నిత్య.. చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఇటీవల స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన నిత్య.. ప్రస్తతం పవన్ సరసన ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీవీ9 కు ఇచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో  .. అప్పట్లో జరిగిన ప్రభాస్ ఇష్యూపై తన మనసులోని భావాలను వ్యక్తపరిచింది.

కెరీర్ తొలినాళ్లలో ప్రభాస్ ఎవరో తనకు తెలియదని చెప్పిన సందర్భం, ఆపై ఎదురైన అనుభవాల గురించి తన మనసులోని బాధను ఒపెన్‌గా చెప్పేసింది.  ప్రభాస్ గురించి మాట్లాడిన సందర్భంలో  తనకు బాగా పెద్ద దెబ్బ తగిలిందని వాపోయింది. తాను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చి ఓనమాలు నేర్చుకుంటున్నానని.. తెలుగు కూడా పెద్దగా తెలియదని తెలిపింది. ఫలానా స్టార్ గురించి అడిగితే.. జన్యూన్‌గానే తెలియదని చెప్పానని.. కానీ దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేశారని వాపోయింది. ఆ సమయంలో జర్నలిస్టులు అలా రాయడంతో మానసికంగా హర్టయ్యానని తెలిపింది. ఆ ఇష్యూ ఇప్పటికీ తనను బాధ పెడుతుందని.. అప్పటినుంచి అన్నిచోట్ల నిజాయితీగా ఉండకూడదని.. ఎక్కడైతే జన్యూన్‌గా ఉండాలో.. అక్కడే ఉండాలని నేర్చుకున్నట్లు నిత్యా తెలిపింది. అంతేకాదు తన లైఫ్ గురించి, ఫిల్మ్ కెరీర్ గురించి ఇంకా ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పింది. అందుకు సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూని దిగువన చూడండి.

Also Read: రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్.. కొద్దిగంటల్లోనే దిమ్మతిరిగే వార్త.. అమ్మిన వ్యక్తి కూడా షాక్