Nikhil Siddhath: మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నిఖిల్.. ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న పోస్టర్..
ఈ ఏడాది కార్తికే 2, 18 పేజిస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు స్పై చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్ చంద్రభోస్ మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే..నిఖిల్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్త్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి రోజు రోజుకు రేంజ్ పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద బ్యానర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ ఏడాది కార్తికే 2, 18 పేజిస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు స్పై చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్ చంద్రభోస్ మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే..నిఖిల్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. అందులో ఒక ఖడ్గం తరహాలో ఉన్న ఆయుధంతో ఈ సినిమా ప్రీ లుక్ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు.
ఈ సినిమా యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తుంది. ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.రవి బసృర్ సంగీతం ను అందిస్తున్నారు. ఇక ఈరోజు గురువారం (జూన్ 1) నిఖిల్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.




ఇవే కాకుండా.. నిఖిల్ ఇటీవల రామ్ చరణ్ నిర్మాణంలో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ది ఇండియా హౌస్ పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై మొదటి సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా 1900 దశకంలో భారతదేశ చరిత్రలో జరిగిన కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం.




