అరటిపండు ఆరోగ్యానికి చేసే మేలు సంగతి మనకు తెలుసు.అయితే.. ఆ పండును సరైన టైంలో తింటే డబుల్ బెనిఫిట్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఉదయం సమయంలో అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి6, పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మలబద్ధకంతో బాధపడేవారికి ఉదయం అరటిపండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.