AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manisha Koirala: అందరూ వదిలేశారు.. మద్యానికి బానిసయ్యాను.. ఎమోషనల్ అయిన నటి

హిందీ సినిమా సౌదాగర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత తమిళ్ లో 1995 తెరకెక్కిన బొంబాయి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఆతర్వాత మనీషా కొయిరాలాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.

Manisha Koirala: అందరూ వదిలేశారు.. మద్యానికి బానిసయ్యాను.. ఎమోషనల్ అయిన నటి
Manisha Koirala
Rajeev Rayala
|

Updated on: May 13, 2024 | 12:28 PM

Share

సినిమా ఇండస్ట్రీ ఊపేసిన హీరోయిన్స్ లో మనీషా కొయిరాలా ఒకరు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు మనీష కొయిరాల. మనీషా  ఓ నేపాలీ నటి. ఆమె ముందుగా మోడలింగ్ చేసి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చారు . హిందీ సినిమా సౌదాగర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత తమిళ్ లో 1995 తెరకెక్కిన బొంబాయి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఆతర్వాత మనీషా కొయిరాలాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. బొంబాయి, భారతీయుడు , ఒకే ఒక్కడు, క్రిమినల్, ముంబాయి ఎక్స్‌ప్రెస్ , నగరం (స్పెషల్ సాంగ్) సినిమాలతో మనీషా కొయిరాలా పేరు మారుమ్రోగింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. అక్కడ ఆమె నటించిన దిల్ సే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా రోజుల తర్వాత తాజాగా హీరమండి: డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచింది మనీషా. ఈ సిరీస్ కు టాప్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే మనీషా కొయిరాలా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మనీషా చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. స్టార్ హీరోలతో మనీషా ప్రేమలో పడిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆమె సామ్రాట్ దహల్ ను వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత మనీషా డిప్రషన్ లోకి వెళ్ళిపోయింది. ఓవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే ఇటు భర్తతో విడిపోవడంతో ఆమె ఒత్తిడికి లోనైంది. ఆ సమయంలోనే మద్యానికి బానిసయ్యింది. విపరీతంగా మద్యం సేవించేది మనీషా. అలాగే 2012లో ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది. అలాంటి కష్టసమయంలో తనకు ఎవ్వరూ అండగా నిలవలేదు అని తెలిపింది మనీషా. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. జనాలు ఎవ్వరి భాదను పట్టించుకోరు. కష్టాల్లో ఉన్నారనగానే మనల్ని ఒంటరిగా వదిలేసి పోతారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. నా స్నేహితులే కాదు బంధువులు ఎవరూ కూడా నాకు అండగా నిలవలేదు. నేనెలా ఉన్నాను.. నా ఆరోగ్యం ఎలా ఉంది.. అనేది పట్టించుకోలేదు. అప్పుడు కేవలం నా తల్లిదండ్రులు, సోదరుడు-వదిన మాత్రమే నాకు అండగా నిలిచారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బాగా అర్థం అయ్యింది అని చెప్పుకొచ్చింది మనీషా కొయిరాలా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే