Manchu Manoj: చంద్రబాబును కలిసిన మంచు మనోజ్‌, మౌనికా రెడ్డి.. కారణమేంటంటే?

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ దంపతులు సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. మనోజ్‌తో పాటు ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత కొద్ది రోజులుగా మనోజ్‌ దంపతులు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనోజ్‌, మౌనిక చంద్రబాబుతో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Manchu Manoj: చంద్రబాబును కలిసిన మంచు మనోజ్‌, మౌనికా రెడ్డి.. కారణమేంటంటే?
Chandrababu, Manoj, Mounika
Follow us

|

Updated on: Jul 31, 2023 | 8:26 PM

అమరావతి, జులై 31: ప్రముఖ టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ దంపతులు సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. మనోజ్‌తో పాటు ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు.  అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మౌనిక దంపతులు ఆయనతో సమావేశమయ్యారు.   గత కొద్ది రోజులుగా మనోజ్‌ దంపతులు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనోజ్‌, మౌనిక చంద్రబాబుతో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే సమావేశం అనంతరం మాట్లాడిన మనోజ్‌ తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టత నిచ్చారు. కేవలం చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్నందుకు కుటుంబ సమేతంగా వచ్చామంటూ మనోజ్‌ దంపతులు చెప్పుకొచ్చారు. కాగా మంచు మనోజ్ సతీమణి మౌనిక కర్నూలుకు చెందిన దివంగత టీడీపీ నాయకులు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల కుమార్తె అన్న విషయం తెలిసిందే. మౌనిక సోదరి భూమా అఖిలప్రియ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు మోహన్‌ బాబు సీఎం జగన్‌కు సమీప బంధువు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఇక మంచు విష్ణు సతీమణి వెరానిక కూడా వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువే. కాగా మౌనికను పెళ్లి చేసుకన్నాక మంచు మనోజ్ కూడా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని అయితే మౌనిక ఆసక్తి చూపిస్తే మాత్రం తాను ప్రోత్సహిస్తానంటూ అప్పట్లోనే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే  చంద్రబాబుతో ఆలుమగలు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.