AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: సైబర్ పోలీసులను ఆశ్రయించిన మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ టీమ్‌.. కారణమిదే

సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వరుసగా సంక్రాంతి సెలవులు ఉండడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు మేకర్స్‌. అయితే గుంటూరు కారం సినిమాపై కొందరు నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారని చిత్ర బృందం ఆరోపిస్తోంది

Guntur Kaaram: సైబర్ పోలీసులను ఆశ్రయించిన మహేశ్‌ బాబు 'గుంటూరు కారం' టీమ్‌.. కారణమిదే
Guntur Kaaram Movie
Basha Shek
|

Updated on: Jan 15, 2024 | 10:21 AM

Share

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలో రిలీజైంది. ఇందులో లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌ గా నటించగా, మీనాక్షి చౌదరి మహేశ్‌ మరదలి పాత్రలో మెప్పించింది. సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వరుసగా సంక్రాంతి సెలవులు ఉండడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు మేకర్స్‌. అయితే గుంటూరు కారం సినిమాపై కొందరు నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారని చిత్ర బృందం ఆరోపిస్తోంది. ఇదే విషయమై వారు సైబర పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రముఖ థియేటర్‌ బుకింగ్‌ యాప్‌ బుక్‌ మై షోలో మహేశ్‌ బాబు సినిమాకు తక్కువ రేటింగ్ రావడం, అలాగే కేవలం 70 వేల ఓట్లే పడడంపై ఆరా తీయాలని సైబర్‌ పోలీసులను కోరినట్లు సమాచారం. ఫేక్‌ ఓటింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాశ్‌ రాజ్‌, జయరాం, రఘుబాబు, రావు రమేశ్, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్‌ అందించిన స్వరాలు చార్ట్‌ బస్టర్‌ గా నిలిచాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఉండడంతో మహేశ్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా గుంటూర కారం మూవీని చూసేందుకు క్యూ కడుతున్నారు. అదే సమయంలో నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవ్వడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

100 కోట్లు దాటేసిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..