Mahesh Babu: మహేష్- త్రివిక్రమ్ సినిమాలో మరో ముద్దుగుమ్మ.. సెకండ్ హీరోయిన్గా ఈ సొట్టబుగ్గల సుందరిని ఫిక్స్ చేశారా.?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పలు లొకేషన్స్ లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు మహేష్. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. సెకండ్ ఆఫ్ లో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :