Nagarjuna : వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటామన్న కింగ్ నాగార్జున..

కింగ్ నాగార్జున ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

Nagarjuna : వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటామన్న కింగ్ నాగార్జున..
Nagarjuna
Follow us

|

Updated on: Dec 14, 2021 | 7:18 AM

Nagarjuna : కింగ్ నాగార్జున ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ మూడు నుంచి ఇప్పటివరకు వరుసగా హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు నాగార్జున. ఇదిలా ఉంటే నాగార్జున తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను తాను దత్తత తీసుకుంటున్నట్టు కింగ్ నాగార్జున ప్రకటించారు. నాగార్జున హౌస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో లో నాగ్ తాను వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తతు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. బిగ్ బాస్ షో కానీ ఎంపీ సంతోష్ కుమార్ అతిథిగా హాజరయ్యారు.

సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే ఇప్పటికే చాలా మంది సినిమా తారలు , ఇతర సెలబ్రెటీలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోకు సంతోష్ కుమార్ హాజరవ్వడంతో నాగార్జున అడవిని దత్తత తీసుకుంటున్నాని ప్రకటించారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ మూడు వారాల్లో మూడు మొక్కలు నాటాలని  సూచించారు. అలాగే తన అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులందరూ మొక్కలు నాటాలని కోరారు.ఇక సంతోష్ కుమార్ ఇచ్చిన మొక్కను బిగ్ బాస్ హౌస్ లో నాటారు. నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..

Rashmika: అది మాములు విషయం కాదు, సమంతను చూసి షాకయ్యా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రష్మిక మందన్నా..