AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simhadri: ఎన్టీఆర్ అభిమానుల మంచి మనసు.. ‘సింహాద్రి’ రీరిలీజ్ కలెక్షన్స్ ఏం చేయనున్నారంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ చిత్రం సింహాద్రి మూవీని ఆయన అభిమానులే సొంతంగా కొనుగోలు చేసుకుని రీరిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మూవీ విడుదల చేయగా వచ్చే కలెక్షన్స్ ను తారక్ ఫ్యాన్స్ సంక్షేమం కోసమే వాడతామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Simhadri: ఎన్టీఆర్ అభిమానుల మంచి మనసు.. 'సింహాద్రి' రీరిలీజ్ కలెక్షన్స్ ఏం చేయనున్నారంటే..
Simhadri
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2023 | 7:37 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్దిరోజులుగా స్టార్ హీరోస్ సినిమాలు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బర్త్ డేస్.. స్పెషల్ డేస్ అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఆరెంజ్ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటివరకు అభిమానుల కోరిక మేరకే ఈ సినిమాలను నిర్మాతలే రీరిలీజ్ చేశారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ చిత్రం సింహాద్రి మూవీని ఆయన అభిమానులే సొంతంగా కొనుగోలు చేసుకుని రీరిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మూవీ విడుదల చేయగా వచ్చే కలెక్షన్స్ ను తారక్ ఫ్యాన్స్ సంక్షేమం కోసమే వాడతామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో 2003లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ సింహాద్రి సినిమాను ఈ సంవత్సరం మే 20వ తేదీన తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని రీరిలీజ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రెస్ నోట్ ద్వారా మీ అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. సింహాద్రి సినిమాను థర్ట్ పార్టీ దగ్గర ఒక ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి.. దానిని రీరిలీజ్ చేసి మా అభిమాన హీరో ఎన్టీఆర్ గారి పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకోవాలని సన్నాహాలు చేస్తున్నాము. ఈ రీరిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ అభిమానులకే తిరిగి చేరాలి అనే ఉద్దేశంతో థర్ట్ పార్టీ దగ్గర చిత్రరైట్స్ మేమే కొనుగోలు చేసి రీరిలీజ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు.. అలాగే స్టేట్ కన్వీనర్స్ అందరము కూడా మాట్లాడుకొని బయటకు వాళ్లకు ఈ రీరిలీజ్ నుంచి వచ్చే వసూళ్లు చేరకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చాము.

ఇవి కూడా చదవండి

ఈ రీరిలీజ్ కలెక్షన్స్ ను ఏ జిల్లాకు ఆ జిల్లాలో కష్టాల్లో ఉన్న తారక్ అభిమానులకు సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ మాట తారక్ గారికి కూడా చెప్పగా.. చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నామని.. ఆయన కూడా ముందుకు వెళ్ళమని చెప్పారు. అభిమానులకు ఎంతో కొంత సాయంగా ఉండటానికే ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నాం. మా స్వలాభం కోసం అయితే కాదు” అంటూ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.రంటే..

Follow Us
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..