AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ డాక్టరమ్మను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. జీవితంలో పెళ్లే చేసుకోదట

డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్ అయ్యాను.. సినిమా ఇండస్ట్రీలోని హీరోలు, హీరోయిన్లు తరచుగా చెప్పే మాట ఇది. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. మెడిసిన్ చదివి ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్ గా స్థిరపడిపోయింది.

Tollywood: ఈ డాక్టరమ్మను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. జీవితంలో పెళ్లే చేసుకోదట
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 20, 2025 | 4:38 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? మెడలో స్టెత స్కోప్ వేసుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఎక్కువగా హోమ్లీ పాత్రల్లోనే కనిపించే ఈ ముద్దుగుమ్మ అభినయంలో మాత్రం అదరగొడుతుంది. అందుకే ఫిల్మ్ ఫేర్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఈ ముద్దుగుమ్మ కీర్తి కిరీటంలో చేరాయి. అయితే ఈ అమ్మడి సినిమా లైఫ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. కానీ ఈ ముద్దుగుమ్మ మెడిసిన్ చదివిందని చాలా మందికి తెలియదు. తిరువనంతపురంలో పుట్టి పెరిగిన ఆమె ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సేస్ లో మెడిసిన్ పూర్తి చేసింది. చదువయ్యాక అక్కడే జూనియర్ డాక్టర్ గా ఇంటర్న్ షిప్ కూడా చేసింది. అదే సమయంలో నటనపై మక్కువ పెంచుకుంది. మొదట మోడలింగ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు బ్రాండ్స్ కు ప్రమోటర్ గా వ్యవహరించింది. యాడ్స్ లోనూ నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. ఆ మధ్యన జీవితంలో పెళ్లే చేసుకోనంటూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ మరెవరో కాదు ఐశ్వర్య లక్ష్మి.

మలయాళం, తమిళ భాషల్లో ఎక్కువగా నటించే ఐశ్వర్యా .. ‘గాడ్సే’తో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయింది. ఆ తర్వాత ‘అమ్ము’, ‘మట్టి కుస్తీ’ సినిమాలతో మెప్పించింది. అలాగే మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోనూ కీలక పాత్ర పోషించింది. ఇక దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా, ఇటీవలే కమెడియన్ సూరితో కలిసి నటించిన మామన్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కేవలం నటనే గాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతోందీ అందాల తార. సాయి పల్లవి నటించిన ‘గార్గి’ నిర్మాతల్లో ఐశ్వర్య కూడా ఒకరు.

ఇవి కూడా చదవండి

ఐశ్వర్య లక్ష్మి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Aishwarya Lekshmi (@aishu__)

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో కలిసి సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఐశ్వర్య. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Aishwarya Lekshmi (@aishu__)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.