AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి.. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు

నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు, నేడు ఆ మహానటుడు శతజయంతి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమా కీర్తిని ఆకాశానికి చేర్చారు అక్కినేని. ఎలాంటి పాత్రైనా సరే ప్రాణం పోసి జీవించేవారు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా చరిత్ర అంటే ముందుగా గుర్తొచ్చేదో ఎన్టీఆర్ , ఎన్నాఆర్ పేర్లే.. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర  వైపు అడుగులేశారు నాగేశ్వరరావు.

Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి.. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు
Anr
Rajeev Rayala
|

Updated on: Sep 20, 2023 | 11:17 AM

Share

తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లికించబడింది. ఆయన నటనకు తెలుగు కళ్ళామ్మ తల్లే మురిసిపోయింది. నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు, నేడు ఆ మహానటుడు శతజయంతి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమా కీర్తిని ఆకాశానికి చేర్చారు అక్కినేని. ఎలాంటి పాత్రైనా సరే ప్రాణం పోసి జీవించేవారు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా చరిత్ర అంటే ముందుగా గుర్తొచ్చేదో ఎన్టీఆర్ , ఎన్నాఆర్ పేర్లే.. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర  వైపు అడుగులేశారు నాగేశ్వరరావు. తెలుగు సినిమాకు నాగేశ్వరావు ఓ మూలస్థంభం. దాదాపు 75 ఏళ్ల పాటు ఆయన సినీ రంగానికి సేవలందించారు. మరో లెజెండ్రీ యాక్టర్  ఎన్టీరామారావు తో కలిసి నాగేశ్వరావు 14 సినిమాల్లో నటించారు.అలాగే తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

వ్యక్తిగతంగా నాగేశ్వరావు నాస్తికుడు. అయినా ఎన్నో భక్తి సినిమాలలో అద్భుతంగా నటించారు.  ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. చివరిగా నాగేశ్వరరావు.. కొడుకు అక్కినేని నాగార్జున, మనవడు నాగ చైతన్య తో కలిసి మనం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత నాగేశ్వరావు కన్నుమూశారు. నేడు ఆ మహానుభావుడి శతజయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన విగ్రవిష్కరణ జరిగింది.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మహేష్ బాబు  ఆయన సతీమణి, హీరో నాని, రామ్ చరణ్, జగపతిబాబు, బ్రహ్మానందం, దర్శకుడు వైవీఎస్ చౌదరి, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్రీకాంత్ ,మంచు విష్ణు, వెంకయ్య నాయుడు, సుబ్బిరామిరెడ్డి, మోహన్ బాబు ఇలా చాలా మంది సెలబ్రెటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

నాగార్జున ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..